కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ లేదా కెబిఅర్ నేషనల్ పార్క్ జూబిలీ హిల్స్ ప్రాంతం లో ఉంది. ఈ పార్క్ ప్రాంగణంలో ప్రిన్సు ముకర్రమ్ జా కి సంబంధించిన చిరన్ పాలస్ ఉంది. కాంక్రీటు అడవుల మధ్యలో ఉన్న సహజ సిద్దమైన అడవిగా ఈ కెబిఅర్ నేషనల్ పార్క్ ని పేర్కొనవచ్చు. పాలస్ మరియు పరిసర ప్రాంతాలని 1998 లో నేషనల్ పార్క్ గా గుర్తించారు.
ఈ ప్రాంతం పేరు మార్చబడినా ఈ పాలస్ పేరు మాత్రం అలాగే ఉంది. తెల్లవారు జామున అలాగే సాయంత్రం వేళల్లో ఈ పార్క్ చాలా హడావిడిగా కనిపిస్తుంది. చాలా మంది వ్యాయామాల కోసం మరియు తాజా గాలి పీల్చడం కోసం ఇక్కడికి ఈ సమయాల లోనే ఎక్కువగా విచ్చేస్తుంటారు. ఆరోగ్యకరంగా ఉండడానికి జాగింగ్, వాకింగ్ వంటివి చేస్తూ ఏంతో మంది ఇక్కడ కనిపిస్తూ ఉంటారు.
ఎన్నో రకాల పక్షులకి, సీతాకోకచిలుకలకి ఈ పార్క్ స్థావరం.నెమళ్ళు, అడవి పిల్లులు, పాంగొలిన్స్ మరియు ఇండియన్ సివెట్ ల వంటి జంతువులని ఇక్కడ గమనించవచ్చు. ఈ పార్క్ లో జంతువుల మరియు పక్షుల దాహాన్ని తీర్చేందుకు ఎన్నో చిన్న చిన్న కొలనులని ఏర్పాటు చేసారు. పర్యాకులు, పక్షులకి, జంతువులకి ఆహారం అందించడం నిషేధం.