హైదరాబాద్ - బెంగుళూరు రహదారి మధ్యలో ఉన్న మీర్ ఆలం ట్యాంక్ అనే సరస్సు నెహ్రు జూలాజికల్ పార్క్ కి అత్యంత సమీపంలో ఉంది. హుస్సేన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ లు నిర్మాణం కాక ముందు నుండే హైదరాబాద్ నివాసితులకి త్రాగు నీరు అలాగే వంట అవసరాల కోసం నీరు అందించేందుకు ఈ మీర్ ఆలం సరస్సు ఉపయోగపడేది.
హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ప్రధాని మంత్రిగా వ్యవహరించిన మీర్ ఆలం బహదూర్ చేత 1804 లో ఈ సరస్సు నిర్మించబడినది. హైదరాబాద్ మూడవ నిజాం అయిన మీర్ అక్బర్ అలీ ఖాన్ సికందర్ జాహ్ ఆసిఫ్ జాహ్ హయాంలో అతని చేత ఈ సరస్సు నిర్మాణమయింది. ఈ సరస్సుని నిర్మించడానికి దాదాపు రెండు సంవత్సరాలు.
ఈ సరస్సు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. టిప్పు సుల్తాన్ పై యుద్ధం చెయ్యడానికి మీర్ ఆలం నిజాం బలగాలని పంపారు. టిప్పు సుల్తాన్ ని ఓడించిన తరువాత మీర్ ఆలం శ్రీరంగపట్నం నుండి తీసుకున్న ఖజనాతో ఈ సరస్సుని కట్టారని నమ్ముతారు.