గోల్కొండ యొక్క ఏడవ సుల్తాన్ అయిన అబ్దుల్లా ఖుతుబ్ షా చేత నిర్మింపబడిన సారాయ్ ఈ తారామతి బారాదరి. ఇబ్రహీం ఖులి ఖుతుబ్ షా చేత నిర్మింపబడిన ఇబ్రహీం బాగ్ అనే ఉద్యానవనం ప్రాంగణంలో నే ఈ సారాయ్ నిర్మించబడినది. ఈ ప్రాంతానికి పర్యటించే ప్రయాణికులకి విశ్రాంతి ప్రదేశంగా మూసీ నది ఒడ్డున ఈ బారాదరి ని నిర్మించారు.
వేశ్య అయిన తారామతి అలాగే ఆమె చెల్లెలు ప్రేమమతి లకి గౌరవార్ధంగా ఈ బారాదరి ని నిర్మించారని గాధలు ఉన్నాయి. అబ్దుల్లా ఖుతుబ్ షా సభ లో ఆట పాటలతో ఈ అక్కా చెల్లెళ్ళు సందడి చేసేవారు. వారి ప్రదర్శనలకి ఆకర్షించబడిన సుల్తాన్ వారి కోసం ప్రత్యేకంగా ఒక సారాయ్ ని నిర్మించి తారామతి పేరునే పెట్టారు. అలా ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రాజ సభలో ప్రాముఖ్యత పొందారు. ఖుతుబ్ షా సుల్తాన్ మరియు రాణులు సమాధి పక్కనే వీరి సమాధిని కూడా గమనించవచ్చు.