చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లో భాగమైన ఈ ట్రిమల్గెర్రీ చర్చ్ ని ఆల్ సెయింట్స్ చర్చ్ గా కూడా పిలుస్తారు. సికింద్రాబాద్ లో ఉన్న ట్రిమల్గెర్రీ లో ఈ చర్చ్ ఉంది. ఈ చర్చ రక్షక దళానికి చెందినది కావడం వల్ల ఈ చర్చ్ లో జరిగే వివిధ వేడుకలు ఉత్సవాలలో సైనిక పురోహితులు ఎక్కువగా పాల్గొనేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లో ఈ చర్చ్ భాగం అయ్యింది.
ఇది ఒక ఆంగ్లికన్ చర్చ్. ఎక్కువగా తమిళులు ఈ చర్చ్ కి రావడం వల్ల ఇక్కడ ఇంగ్లీష్ మరియు తమిళ భాషలలో ఇక్కడ భోధనలు జరుగుతాయి. విలక్షణమైన గోతిక్ నిర్మాణ శైలితో ఈ చర్చ్ ఉండడం వల్ల ఏంతో మంది పర్యాటకులు మధ్య ఈ చర్చ్ ప్రాచుర్యం పొందింది. శిలువతో ఉన్న జీసస్ ని వర్ణన కలిగిన అందమైన గాజు కిటికీ పూజా వేదికగా వ్యవహరిస్తోంది.
1884 కి చెందిన ఈ భాగం రాయల్ ఫిరంగి యొక్క లెఫ్టినెంట్ ఎడ్వర్డ్ డాసన్ కి గుర్తుగా వ్యవస్థాపించబడినది. 1983 లో క్వీన్ ఎలిజబెత్ రెండు సందర్శన తరువాత ఈ చర్చ్ అంతర్జాతీయ గుర్తింపు పొందింది.