కరార్ ఫోర్ట్ లేదా జౌంపూర్ కోటగా కూడా పిలవబడే షాహి ఖిల్లా (రాయల్ ఫోర్ట్) ఒక చరిత్రను కలిగి ఉంది. దీనిని గతంలో ఒక మట్టిదిబ్బ మీద నిర్మించారు. అప్పుడు కేర్రార్ ఫోర్ట్ అని పిలిచేవారు. దీనిని 1376-77 సంవత్సరం లో ఫిరోజ్ షా తుఘ్లక్ యొక్క సేనాపతి అయిన ఇబ్రహీం నయిబ్ బర్బాక్ ద్వారా పునర్నిర్మించారు.
ఈ కోట గోమతి నదిపై ఉన్న షాహి వంతెనకు దగ్గరగా ఉన్నది. ఈ కోటని నిర్మించటానికి కన్నౌజ్ రాథోర్ రాజుల దేవాలయాలు మరియు కోటలకు చెందిన మెటిరియాల్ ను ఉపయోగించారు. ఈ ఆలయాలు మొగలుల దాడిలో నాశనమయ్యాయి.
ఈ కోట తుగ్లక్ పాలన తర్వాత అంటే వంద సంవత్సరాల తరువాత నాశనం అయింది. విస్తృత స్థాయిలో మరమ్మతులను మొఘల్ చక్రవర్తులు హుమాయున్ మరియు అక్బర్ పాలనలో పునరుద్ధరించారు. కోట బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కానీ మళ్ళీ 1857 లో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం సమయంలో నాశనం కాబడింది. ఇది జౌంపూర్ నుండి 2.2 కిమీ దూరంలో ఉన్నది. కోట నగరం యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా ఉన్నది.