ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ గంగా నదికి చిన్న ఉపనది అయిన ఘఘ్రా నది ఒడ్డున ఉంది. బాగా అభివృద్ధిచెందిన ఈ చిన్నతరహా పట్టణం బెంగాల్ నవాబు అలీ వర్డి ఖాన్ చే 1730 లో స్థాపించబడింది. కొన్ని సంవత్సరాల తరువాత, ఈ ప్రాంతం షుజ-ఉద్-దౌలా చే అవద్ ప్రాంత రాజధానిగా ప్రకటించబడింది. ఈ పట్టణం అతని పాలనలో బాగా అభివృద్ది చెందింది, ఇప్పటికీ, ఫైజాబాద్ సగర్వంగా దాని రంగులతో కూడిన గతాన్ని సందర్శకులకు ప్రదర్శిస్తుంది. నవాబులు నిర్మించిన అనేక కళాత్మకతతో అలంకరించబడిన భవనాలు ఈరోజు వాటి గోప్పతాంలో తేజస్సుతో నిలబడతాయి.
ఫైజాబాద్ లో, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు
ఫైజాబాద్ అనేక ప్రదేశాలకు, ఫైజాబాద్ మ్యూజియం, ఫోర్ట్ కలకత్తా తోసహా ఆకర్షణలకు నిలయం. బహు బేగం కా మక్బరా, మోతి మహల్ వంటి ముఘల్ స్మారకాలు కూడా సందర్శనకు విలువైనవి. రిషభదేవ్ రాజఘట్ ఉద్యాన్ మొదటి జైన తీర్థంకరుడైన, భగవాన్ రిషభదేవ్ జ్ఞాపకం చిహ్నం. గుప్తర్ ఘాట్ హిందువులకు అపరిమితమైన గౌరవంతో కూడిన విలువ కలిగిఉంది, ఎందుకంటే శ్రీరాముడు భూమిని వదిలి జలసమాధి చెందిన తరువాత విష్ణుమూర్తి అవతారంలో కలిసిపోయింది ఇక్కడేనని నమ్ముతారు.
ఫైజాబాద్ చేరుకోవడం
ఫైజాబాద్ కి రైలు, రోడ్డు మార్గాలు బాగా అనుసంధానించబడి ఉన్నాయి. లక్నో దీనికి సమీప విమానాశ్రయం.
ఫైజాబాద్ సందర్శనకు సరైన సమయం
నవంబర్, మార్చ్ మధ్య సమయంలో ఫైజాబాద్ సందర్శన ఉత్తమమైనది.