సయ్యద్ షా మొహమ్మద్ హుస్సెఇన్ కి సంబంధించిన సమాధి, కడప లో ఉన్న ఈ చాంద్ ఫిరా గుంబద్. నగరానికి నడిబోడ్డులో ఉండడం వలన ఈ సమాధిని సందర్శించడం తేలికే. ఈ భవనం యొక్క నిర్మాణం మరియు ఆకృతి లో ప్రత్యేకమైన శైలి కనబడుతుంది. చదరపు ఆకారం లో ఉన్న ఈ భవనం మధ్యలో ఒక పెద్ద గోపురం ఉంటుంది. ఈ భవనం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు సమాధులకి రక్షణగా ఉంటాయి. లోపల బయటా ఈ భవనం అందంగా అలంకరించబడినది. ఈ భవనం వద్ద ఉన్న పిట్ట గోడ చిత్రవిచిత్రమైన నమూనాల తో కప్పబడి ఉన్నది.
నిజాముల కాలం నాటి నిర్మాణ శైలి కి ఈ సమాధి ఒక చక్కటి ఉదాహరణ. ఈ సమాధులు ఉన్న ఎత్తైన గోడలని చూడడానికి ఏంతో మంది పర్యాటకులు అమితమైన ఆసక్తిని కనబరుస్తారు. లోపల బయటా అందంగా ఉండే ఈ మసీదుని సందర్శించేందుకు ఎంతో మంది పర్యాటకులు తరలి వస్తారు. స్థానిక ఇస్లాం జనాభాలో ఈ ప్రాంతం అత్యంత ప్రసిద్ధి చెందినది.