హిందువుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన దెవునికడప అత్యంత ప్రాముఖ్యత కలిగినది. తిరుమల తిరుపతి దేవుని యొక్క ఆశీస్సులు కోరుకునే భక్తులు వారి తీర్ధయాత్ర లు పూర్తి అయినట్టుగా భావించాలంటే తప్పకుండా ఈ దేవుని కడపని సందర్శించవలసిందే.
తిరుమల తొలి గడప దేవుని కడప గా ప్రాచుర్యం పొందింది దేవుని కడప. విజయనగర సామ్రాజ్యం కాలం నుండి ప్రఖ్యాతి చెందిన శ్రీ లక్షీ వెంకటేశ్వర ఆలయం ఇక్కడ ఉంది. గురు కృపాచార్య చేత ఈ ఆలయం లో వెంకటేశ్వర స్వామీ వారి విగ్రహం ప్రతిష్టింపబడినది. అందువల్ల పురాణాలలో కూడా ఈ దేవాలయం గురించి ప్రస్తావించబడినది. కృపావతి క్షేత్రంగా ఆ కాలం లో ఈ ఆలయం ప్రసిద్ది చెందింది.
అన్నమాచార్యుల వారిని అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మొదట ప్రార్ధించిన తరువాత తిరుపతి ప్రయాణానికి యాత్రికులు పయనమవుతారు. పూజలు చెయ్యడానికి ఏంతో మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. వారం పొడవునా ఈ ఆలయం భక్తుల సందర్శనతో కిటకిట లాడుతూనే ఉంటుంది. శనివారాలు అయితే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.