కాళహస్తి దేవాలయానికి తూర్పు వైపున మూడు కొండల మధ్య భరద్వాజ తీర్థం వుంది. త్రేతా యుగంలో ఇక్కడ తపస్సు చేసిన భరద్వాజ మహాముని పేరిట ఈ తీర్థం ఏర్పడింది. ఈ తీర్థం నెలకొని వున్న అందమైన లోయ పచ్చటి కొండలు, నిర్మలమైన సెలయేళ్ల తో వుంది ఈ ప్రాంతానికి ఒక దైవికమైన వాతావరణాన్ని తీసుకువచ్చింది. అందువల్ల పట్టణంలోని ఈ ప్రాంత౦లో ఈ తీర్థం ఏర్పడడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
ఒక చెరువులా వుండే ఈ తీర్థం మధ్య ధ్యానముద్రలో వున్న తపో వినాయకుడి అద్భుతమైన విగ్రహం వుంది. ఐతే, ఈ తీర్థం చేరుకోవడానికి మీరు రద్దీగా వు౦డే మార్కెట్ ప్రాంతం గుండా వెళ్ళాలి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ చెరువులో మునక వేయడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తారు. నిజానికి, ఈ తీర్థంలో స్నానం చేసాక మాత్రమె శివుడికి పూజలు చేయాలని విశ్వసిస్తారు.