కల్సి లోని అసోకుని శిలా శాసనం , శిల పైన చెక్కబడిన శాసనం . రికార్డుల ప్రకారం మౌర్య రాజు అయిన అశోకుడు తన పధ్నాలుగవ శాసనాన్ని ఈ శిల పైన చెక్కించాడు . ఇది రాజు యొక్క సంస్కరణలు మరియు సలహాలను తెలియచేస్తుంది . ఈ శిలా శాసనాన్ని జాన్ ఫారెస్ట్ 1860 లో కనుగొన్నాడు. ఈ శాసనం ప్రకృతి బాష లో బ్రాహ్మి పాళీ లిపి లో చెక్కబడినది . ఇది భారత శిలా శాసనాల శాస్త్రం లో 10 ft x 10ft x 8ft కొలతలు కలిగిన ముఖ్యమైన స్మారక చిహ్నం. ఒక ఏనుగు ఆకారం లో చెక్కబడిన ఈ రాతి లో ఏనుగు కాళ్ళ మధ్యలో 'గజతం' అనే అక్షరాలను గమనించవచ్చు. క్రీ.పూ 253 నాటికీ చెందిన చేక్కదాలలో ఎంటియొచస్, మగస్, అంటిగోనాస్, టోలెమీ మరియు అలెక్జాండర్ అనబడే అయిదు గ్రీకు రాజుల పేర్లు ఇక్కడ గమనించవచ్చు.



Click it and Unblock the Notifications