మధ్యయుగ కాలం లో క్రీస్తు శకం 7 నుండి 8 వ శతాబ్దం మధ్యలో నిర్మింపబడిన మార్తాండ్ సన్ టెంపుల్ హిందువుల ప్రత్యక్ష దైవం అయిన సూర్యునికి అంకితమివ్వబడినది. సూర్య వంశమునకి చెందిన రాజైన లలితాదిత్య ఈ ఆలయాన్ని అనంతనాగ్ అనే చిన్న పట్టణానికి సమీపంలో పీఠభూమి పైన నిర్మించాడు.
లలితాదిత్య రాజుచే నిర్మించబడిన నిర్మాణాలలో ఉత్తమమైనదిగా 84 స్తంభాలతో కట్టబడిన ఈ ఆలయాన్ని పరిగణించవచ్చు. అప్పటి వారి నిర్మాణ నైపుణ్యాలు ఈ ఆలయ నిర్మాణ సమయంలో ఉపయోగించిన చదరపు సున్నపు రాయి ఇటుకలు తెలుపుతాయి. ఈ ఆలయ నిర్మాణ శైలి అద్భుతంగ ఉంటుంది. మంచు పర్వత నేపధ్యంలో ఉన్న ఈ ఆలయం ఎంతో అందంగా ఉంటుంది. ఈ ఆలయం నుండి కాశ్మీర్ లోయ అందాల విశాలదృశ్య వీక్షణం ఆహ్లాదకరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications