లడఖ్ కు వెళ్లాలనుకునే యాత్రికులు, ప్రధాన రవాణా పద్ధతులలో ఎదో ఒకటి, విమాన యానం, రైలు ప్రయాణం లేక రహదారులని గానీ ఎన్నుకోవచ్చు. విమాన యానం: రాష్ట్రం లోని ప్రధాన నగరాలకు అనుసంధానించబడిన లడఖ్ విమానాశ్రయం ఇక్కడికి అతి సమీపం లోని విమానాశ్రయం. అయితే, జమ్మూ విమానాశ్రయం, జమ్మూ&కాశ్మీర్ లోని ప్రధాన విమానాశ్రయం. జమ్మూ నుంచి దేశం లోని ప్రధాన నగరాలైన కొత్త ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై లాంటి నగరాలకి ఎన్నో విమానాలు ఉన్నాయి. కొత్త ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లడఖ్ ని అంతర్జాతీయంగా కూడా కలుపుతుంది.