"తిరునవయ నవ ముకుంద ఆలయం" అని కూడా పిలవబడే తిరునవయ ఆలయం గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రాచీన దేవాలయం. భరతపుళ నదీ తీరంలో మనోహరంగా ఉండే ఈ గుడి, కేరళ మొత్తం నించి భక్తులను ఆకర్షిస్తుంది. ప్రసిద్ధ మమంకం ఉత్సవం జరిగే ప్రదేశంగా కేరళ ప్రాచీన చరిత్ర లో భాగం సంపాదించిన ఈ ఆలయం, తిరునవయ అనే చిన్న గ్రామం లో ఉంది."నవ ముకుందన్" అని పిలవబడే శ్రీ మహా విష్ణువు ఇక్కడి ఆరాధ్య దైవం. ఆలయ ప్రాంగణంలో గణపతి, లక్ష్మి దేవి కి అంకితం చేయబడిన చిన్న గుళ్ళు కనిపిస్తాయి. ఈ ప్రాంతం ప్రాచీన కాలం లో వైదిక విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెంది , దక్షిణ భారత పండితులు అందరిచేత సందర్శించబడేది. మైసూరు దండయాత్ర కాలంలో టిపు సుల్తాన్ సైన్యం చేత ఈ గుడి ధ్వంసానికి గురి అయ్యి, కొల్లగొట్ట బడింది. అయితే తరువాత మళ్ళీ గత వైభవాన్ని సంపాదించింది. తానూర్ పట్టణానికి 8 కి.మీ ల దూరంలో ఉన్న తిరునవయ ఆలయానికి రహదారి గుండా చేరుకోవచ్చు.