కేరళ లోని ఉత్తర ప్రాంతపు జిల్లా అయినటువంటి మలప్పురం గొప్ప సంస్కృతికి, చారిత్రిక ప్రాధాన్యతకి, విశిష్టమైన వారసత్వ సంపదకి ప్రసిద్ధి. చిన్న కొండలతో , గుట్టలతో అలంకరించబడిన మలప్పురం ప్రాంతం సార్ధక నామధేయి (మలయాళంలో మలప్పురం అనగా పర్వత శిఖరం). ప్రాచీన , ఆధునిక సంస్కృతులను కలిపి అల్లిన చరిత్ర కలిగి ఉన్న మలప్పురం ప్రాంతం సంస్కృతికి, మతానికి, ఆర్ధిక వ్యవస్థకి మాత్రమే కాక కేరళ పర్యాటక రంగానికి కుడా విస్తృతంగా దోహదపడింది. "గల్ఫ్" వలస జనాభా వలన కలిగిన మునుపెన్నడూ ఎరుగని ఆర్థిక వృద్ధి దేశ ఆర్ధిక వేత్తల దృష్టిని ఈ జిల్లా ఆకర్షించింది.
చలియార్, భరతపుళ, కదలుండి అనే మూడు నదులు ప్రవాహం మలప్పురం నేలని , సంస్కృతిని సుసంపన్న చేస్తున్నాయి. గత రోజుల్లో కాలికట్ కి చెందిన జామోరిన్స్ రాజుల బలమైన సైన్యానికిది ప్రధాన కేంద్రం గా ఉంది.
ఖిలాఫత్ ఉద్యమానికి, మోపిల తిరుగుబాటుకి జన్మస్థలమై భారత జాతీయ చరిత్ర లో ముఖ్య భూమిక పోషించింది. ఒప్పాన అనబడే మహమ్మదీయ నాట్యకళకి ఇది పుట్టినిల్లు.
అనేక సంప్రదాయాలు , ప్రత్యేక ఆకర్షణలు
మలప్పురం లోని చిన్న పట్టణాలు కేరళ సంస్కృతిక, రాజకీయ, సాహిత్య సంప్రదాయాలకి సాటిలేని విధంగా దోహదపడ్డాయి. మధ్యయుగ కాలంలో "తిరునవయ" వైదిక విద్య కు కేంద్రంగా ఉంది. సాంప్రదాయ ఆయుర్వేద వైద్య వ్యవస్థ "కొట్టక్కళ్" లో మొదలయ్యింది. పొన్నాని (ప్రాచీన మహమ్మదీయ విద్యా కేంద్రం) నీలంబుర్ ( టేక్ పట్టణం) మలప్పురానికి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించాయి.
మలప్పురం లో కదలుండి పక్షి సంరక్షణ కేంద్రం, కేరళదేశ్ పురం ఆలయం, తిరునవయ లాంటి సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మలప్పురం జుమా మసీదు, మన్నూర్ శివాలయం, తిరుప్పురంతక దేవాలయం, వెట్టకోరుమకన్ దేవాలయం లాంటి గుళ్ళు,మసీదులు కలవు. కొట్టక్కున్ను పర్వత ఉద్యానవనం, బియ్యం సరస్సు, శాంతితీరం నదీతీర ఉద్యానవనం వేలాది మంది పర్యాటకులని ఇక్కడికి రప్పిస్తున్నాయి.
మలప్పురం రహదారి, రైలు, వాయు మార్గాల ద్వారా అనుసంధానించబడటం వల్ల సంవత్సరం పొడుగునా యాత్రికుల ఎటువంటి వ్యయప్రయాసలు లేకుండా చేరుకోవచ్చు. మధ్యస్థ వాతావరణం కలిగి పర్యటన కు అనుకూలంగా ఉంటుంది. మహమ్మదీయ జనాభా అధికంగా ఉండటంవల్ల అరబిక్, కేరళ సంప్రదాయ రుచుల మేలు కలయికగా ఒక విశిష్ట భోజన సంస్కృతి ఇక్కడ వెల్లివిరిసింది. ప్రాకృతిక సౌందర్యం, సంఘటనాత్మక చరిత్ర, అసాధారణ వంటకాలు ఇక్కడ ప్రకృతి ఆరాధకులని, చరిత్ర ప్రేమికులని, భోజన ప్రియులని సరి సమానంగా సంతృప్తి పరుస్తాయి.