ఈ ప్రదేశం మనసులు కరిగించే గాధ. రాణి రూపమతి మరియు బాజ్ బహదూర్ ల ప్రేమ కధ. ఈ ప్రేమ కధలో కులం, మతం ప్రపంచ బంధాలు ఏమీ వుండవు. పూర్తిగా వారి ప్రేమ , త్యాగాలకు సంబంధించినది. వీరి ప్రేమ కధ వివిధ రకాలుగా చెపుతారు. వాస్తవం మాత్రం నేటికి తెలియదు. ఈప్రదేశం నుండి రాణి రూపమతి తన ప్రియుడి భవనాన్ని, తనకు ఎంతో ఇష్టమైన నర్మదా నదిని చూసేదని చెపుతారు.
ఈ ప్లేస్ నుండి కనపడే ప్రకృతి దృశ్యాలు ప్రేమ అన్నింటిని జయిస్తుంది అనే అర్ధం చెపుతాయి. పాలస్ సమీపంలో ఒక ఎకో పాయింట్ కలదు. పాలస్ నుండి సూర్యాస్తమయ దృశ్యాలు అద్భుతంగా వుంటాయి.