మంత్రాలయం లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం ఈ ప్రాంతపు అతి ముఖ్యమైన సందర్శక ప్రదేశం. గురూజీ శ్రీ మహా విష్ణువు భక్త తత్పరుడైన ప్రహ్లాదుని అవతారమని నమ్మకం. శ్రీ మహా విష్ణువు , శ్రీ నరసింహ స్వామి అవతారమెత్తి ప్రహ్లాదుని రాక్షస తండ్రి ని వధించి ఆతని దుష్ట యోచనలనుంచి తన భక్తుని కాపాడుకున్నారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనం ఏర్పాటుచేయడానికి మంత్రాలయాన్నే ఎంచుకున్నారు.
ఈ ఆలయం గురూజీ వేలాది భక్తులలో బాగా ప్రాచుర్యం పొందినది. వారు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం గురు జయంతి రోజు ఆలయాన్ని సందర్శించుకుంటారు. జయంతి రోజు ఉత్సవాలు జరుపుకోవటం వల్ల ఆలయం విభిన్న కార్యకలాపాలతో కోలాహలంగా ఉంటుంది. రెండు రోజులు పాటు సాగే ఈ వేడుకలలో హాజరుకావటానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. గురూజీ ఇప్పటికీ బృందావనంలోనే నివసిస్తున్నారని, మరో 361 సంవత్సరాలు ఇక్కడే ఉంటారని చాలా మంది భక్తుల నమ్మకం.