రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చెప్పుకునే పండుగల్లో దసరా, దీపావళి, సంక్రాతి. ఈ పండుగలో పట్టణాలకు ఉపాధి కోసం వచ్చినవారు తమ పల్లెటూర్లకు బయలుదేరుతారు. ఈ పండుగ క్షణాల్లో అయిన కుటుంబసభ్యులతో కలిసి సరాదాగా పండుగలు జరుపుకోవాలనుకుంటున్నారు. అందుకోసం ఊర్లకు పయనమవుతారు. అయితే, వారు ప్రయాణ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. పండుగ సీజన్లో బస్సుల్లో జర్నీ అంటే.. కూర్చోడానికి కూడా కనీసం సీటు దొరకదు. ఇక, ఆటోలు, కారు ట్యాక్సీలో వెళ్దామనుకునే సాధారణ ప్రజలకు వాటి ధరలు చుక్కల్ని చూపిస్తాయి.
అయినా కానీ, అందులో కొందరు అధిక ధరలను వెచ్చించి మరీ ప్రయాణం సాగిస్తుంటారు. ఇక ట్రైన్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు, మూడు నెలల ముందే ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతలా ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసి పోయింటాయి. అయితే, ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్, నవంబర్ నెలలో జరుపుకునే ప్రధాన పండగులు అయిన దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రతిరోజూ రాత్రి 8గంటలకు..
ఇందులో భాగంగానే, దసరా ప్రయాణాల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న విజయవాడ టు శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లను అధికారులు ప్రకటించారు. ఈ స్పెషల్ ట్రైన్స్ అక్టోబర్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. దసరా పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

విజయవాడ టు శ్రీకాకుళం రోడ్ మధ్య స్పెషల్ ట్రైన్స్ను ప్రకటించింది. 07215 అనే నెంబర్గల విజయవాడ టు శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ట్రైన్ ప్రతి రోజు రాత్రి 8గంటలకు బయలుదేరుతుంది. విజయవాడ స్టేషన్ నుంచి బయలుదేరే ఈట్రైన్ శ్రీకాకుళం రోడ్ స్టేషన్కు ఉదయం ఐదున్నర గంటలకు చేరుకుంటుంది. ఈ నెల (అక్టోబర్) 9, 10, 11, 12, 14, 15, 16, 17 తేదీల్లో ఈ స్పెషల్ ట్రైన్స్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
సాయంత్రం నాలుగు గంటలకు..
తిరుగు ప్రయాణంలో 07216 అనే నెంబర్గల శ్రీకాకుళం రోడ్ టు విజయవాడ స్పెషల్ ట్రైన్ శ్రీకాకుళంలో ఉదయం ఆరున్నరకు బయల్దేరి సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ స్టేషన్కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఈ నెల (అక్టోబర్) 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
ఈ స్టేషన్లలో ఆగుతుంది...
విజయవాడ టు శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ట్రైన్ విజయవాడ నుంచి బయల్దేరి ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారకపూడి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆగుతుంది. ఈ ట్రైన్లో ఏసీ త్రీ టైర్, స్లీపర్ కోచ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. దసరా పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ స్పెషల్ ట్రైన్స్ కొనసాగిస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications













