ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రాంతాలు కలవు అవి ఒకటి రాయలసీమ కాగా, రెండవది కోస్తా ఆంద్ర. పూర్వపు రాష్ట్రాన్ని తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్ లు గా జూన్, 2014 లో, భారత దేశపు పార్లమెంట్, ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం బిల్లు మేరకు విభజించింది.
భౌగొళికత
భౌగోళికంగా, ఆంధ్ర ప్రదేశ్ లో అనంతపూర్, చిత్తూర్, కడప, కర్నూల్, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు కృష్ణ జిల్లాలు కలవు. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకత
ఆంధ్ర ప్రదేశ్ లో టూరిజం
రాష్ట్రంలోని యాత్రా స్థలమైన తిరుపతి కి భక్తులు అధిక సంఖ్యలో పర్యటించ డం తో మొదలవుతుంది. తిరుపతి లోని తిరుమల వెంకటేశ్వరా దేవాలయమే కాక ఇంకనూ రాష్ట్రంలో సందర్శించ తగిన అనేక పర్యాటక ప్రదేశాలు కలవు. వాటిలో కపిల తీర్థం, పులికాట్ సరస్సు వంటివి ప్రసిద్ధి చెందినవి.
ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అనేకమంది ప్రసిద్ధ కవులకు, రచయితలకు, కళాకారులకు జన్మస్థలం. ఈ ప్రదేశం, వివిధ సంస్కృతులు కల పాలకుల పాలనలో వుండటంచే వివిధ రీతుల తెలుగు మాట్లాడతారు. కూచిపూడి నాట్య జన్మస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని సాంప్రదాయ కూచిపూడి నాట్యం కు కృష్ణా జిల్లాలో కల కూచిపూడి అనే ఒక చిన్న గ్రామం పుట్టిల్లు. ఆంధ్ర ప్రదేశ్ ఆహారాలు ఆంద్ర ప్రదేశ్ లో ప్రజలకు ప్రధాన ఆహారం వరి అన్నం. ఇతర వంటకాలు దక్షిణ భారత దేశంలోని వంటకాలన్నిటి లోకి అతి ఘాటైనవి. కోస్తా ప్రాంతంలో సముద్రపు ఆహారాలు ప్రసిద్ధి. రాయలసీమ జిల్లాలు దక్షిణ కర్నాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు సన్నిహితంగా ఉండటంతో ఆయా రాష్ట్రాల వంటల రుచులు కూడా కలిగి వుంటాయి. ఈ ప్రాంతంలో బెల్లం మరియు జోన్నలచే తయారు చేయబడే బొరుగు ఉండలు, బియ్యం మరియు బెల్లం తో చేయబడే అరిశలు, మసాల బొరుగులు మరియు రవ లడ్డు లు ఒక ప్రత్యేకత.
రవాణా మరియు అనుసంధానం
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన విమానాశ్రయం విశాఖపట్నం లో కలదు. ఇది కాక, ఇతర స్థానిక విమానాశ్రయాలు విజయవాడ, రాజమండ్రి లలో కూడా కలవు. ఇండియా లోని ఎ నగరం నుండి అయినా ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతానికైనా సరే తేలికగా పర్యటించే రీతిలో ఇక్కడి రవాణా వ్యవస్థ వుంటుంది.