ఏపీలోని విజయవాడ డివిజన్లో రైల్వే ట్రాక్ల నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించారు. అసలే వేసవి ప్రయాణాల ప్రణాళికలతో బిజీగా ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించిన ఆ జాబితాలో ఏ రైళ్లు రద్దు చేయబడ్డాయి? ఏ రైళ్లు దారిమళ్లించబడ్డాయి తెలుసుకుందామా?!
రైలు ప్రయాణీకుల భద్రత విషయంలో కేంద్ర రైల్వే ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. అందులో భాగంగా నిత్యం ఎక్కడికక్కడ మరమ్మతు పనులు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ప్రయాణీకులు ఇబ్బంది పడినప్పటికీ వారి భద్రతే రైల్వేకు ముఖ్యం. ఇందులో భాగంగానే విజయవాడ డివిజన్లో రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం-విశాఖపట్నం (17219), గుంటూరు-విశాఖపట్నం (22701/22702), ఏప్రిల్ 2 నుంచి 29 వరకు విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ట్రాక్ నిర్వహణ పనులు పూర్తయ్యేవరకే ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

పాక్షికంగా రద్దయిన రైళ్ల బాబితా..
వీటితోపాటు ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం - విజయవాడ (07896), విజయవాడ - మచిలీపట్నం (07769), నర్సాపూర్ - విజయవాడ (07863), విజయవాడ - నర్సాపూర్ (07866), మచిలీపట్న - విజయవాడ (07770), విజయవాడ - భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం - విజయవాడ (07870), విజయవాడ - నర్సాపూర్ (07861) రైళ్లు విజయవాడ - రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయని తెలిపారు. వీటి జాబితా ఎప్పటికప్పుడు వెల్లడించనున్నట్లు ప్రకటించారు.
ఈ రైళ్లను దారి మళ్లించారు..
ఏప్రిల్ 1, 8, 15, 22 తేదీల్లో ఎర్నాకుళం-పాట్నా (22643), ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో భావ్నగర్ - కాకినాడ పోర్టు (12756), ఏప్రిల్ 3, 5, 10, 12, 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు-గౌహతి (12509), ఏప్రిల్ 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ (11019), ఏప్రిల్ 1 నుంచి 28 వరకు ధనాబాద్ - అలప్పుజ (13351), ఏప్రిల్ 4, 11, 18, 25 తేదీల్లో టాటా-యశ్వంత్పూర్ (18111), ఏప్రిల్ 3, 10, 17, 24 తేదీల్లో జసిదిహ్ - తాంబరం (12376), ఏప్రిల్ 1, 8, 15, 22 తేదీల్లో హతియ - ఎర్నాకుళం (22837),
ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో హతియ - బెంగళూరు (18637), ఏప్రిల్ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో హతియ - బెంగళూరు (12835), ఏప్రిల్ 5, 12, 19, 26 తేదీల్లో టాటా - బెంగళూరు (12889) రైళ్లు వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించినట్లు వెల్లడించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ తరహా చర్యలు తీసుకుంది రైల్వే శాఖ. వేసవి విహారానికి ఇప్పటికే ప్లాన్ చేసుకున్న ఔత్సాహిక పర్యాటకులు ఇందుకు అనుగుణంగా తమ టూర్ ప్లాన్ను మార్చుకుంటే సరిపోతుంది.



Click it and Unblock the Notifications













