విమానం ద్వారా: పాలంపూర్ కు దగ్గరలో ధర్మశాల విమానాశ్రయం ఉన్నది. దీనినే గగ్గల్ అని కూడా అంటారు. ఇది పాలంపూర్ కు 40 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం ముఖ్య నగరాలయిన డిల్లీ, ముంబై లకు అనుసంధించబడి ఉన్నది. ప్రయాణికులు గగ్గల్ నుండి పాలంపూర్ కు సులభంగా టాక్సీలో చేరుకోవొచ్చు. దీనికి 750 రూ. ఖర్చు అవుతుంది. విదేశీ ప్రయాణికులకు 508 కి.మీ. దూరంలో ఉన్న డిల్లీ నుండి పాలంపూర్ కు అనుసంధించబడి ఉన్న విమానాల ద్వారా చేరుకోవొచ్చు. డిల్లీ నుండి పాలంపూర్ కు 10,000 రూ. ఖర్చు అవుతుంది.