క్యుంకలేశ్వర్ మహాదేవ్ ఆలయం పౌరీ పర్యటన సమయంలో ఆది శంకరాచార్య 8 వ శతాబ్దంలో నిర్మించారు. ప్రధాన పట్టణ సరిహద్దులో ఉన్న ఈ ఆలయం శివునికి అంకితం చేయబడినది. మహాశివుడు పార్వతీదేవి, గణపతి మరియు షణ్ముఖుని తో ఇక్కడ కొలువు తీరాడు. అదనంగా, రాముడు, లక్ష్మణుడు మరియు సీతా దేవిల విగ్రహాలు కూడా ప్రతిష్టించారు. అలకానంద లోయ నేపథ్యంతో అలంకరించబడిన ఆలయ ప్రాంగణం, పట్టణం వెంబడి హిమాలయాల శ్రేణుల మంచుతో కప్పబడిన సుందరమైన దృశ్యాలను అందిస్తుంది. హిందూ మత పండుగ మహా శివరాత్రి ఇక్కడ చాలా వైభవంగా మరియు మతపరమైన ఉత్సాహంతో నిర్వహించబడుతుంది.



Click it and Unblock the Notifications