ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కుశంబి జిల్లాలో ప్రభాస్ గిరి పట్టణం ఉన్నది. అంతే కాకుండా అలహాబాద్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ పట్టణము జైన్ సమాజం వారి కోసం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉన్నది. సంవత్సరం పొడవునా సందర్శకులను ఆకర్షిస్తుంది.జైన్ సమాజంనకు ప్రధాన ఆకర్షణగా భగవాన్ పద్మ ప్రభు దేవాలయము ఉన్నది. ఈ దేవాలయంనకు ,ఆరవ జైన తీర్థంకరుడు భగవాన్ పద్మ ప్రభు పేరు పెట్టబడింది. ప్రభాస్ గిరి హిందువులకు కూడా పవిత్ర ప్రదేశం. ఈ ప్రదేశంలో లార్డ్ కృష్ణుడు భూమి పైన అయన చివరి రోజులు గడిపారని చెప్పుతారు.
ఈ పట్టణంలో అనేక గుహలు ఉన్నాయి. ఈ గుహల గోడల మీద పురాతన బ్రహ్మి లిపిలో రాసి ఉన్న అక్షరాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ గుహలు గొప్ప చారిత్రక ఆసక్తి కలిగి ఉన్నాయి. మీరు ప్రభాస్ గిరి సందర్శించినప్పుడు దానికి సమీపంలో ఉన్న కారా మరియు మంఝాన్పూర్ ను చూడవచ్చు. కారా శీతల మాతా ఆలయం, చ్చేత్రపాల్ భైరవుని ఆలయం, హనుమాన్ ఆలయం మరియు కాళేశ్వర్ మహాదేవ్ దేవాలయములతో సహా అనేక హిందూ మతం దేవాలయాలు ఉన్నాయి. శీతల మాతా ఆలయం గంగా నది ఒడ్డున ఉంది. అంతేకాక ఈ దేవత మొత్తం 51 శక్తిపిటంలలో అతిపెద్ద శక్తిపిటంగా పరిగణించబడుతుంది. మంఝాన్పూర్ లో కూడా కమసిన్ దేవి ఆలయం ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది ఒక ప్రముఖ మత కేంద్రంగా ఉంది.