జైన్ సమాజంనకు ప్రధాన ఆకర్షణగా భగవాన్ పద్మ ప్రభు దేవాలయము ఉన్నది. ఈ దేవాలయంనకు ఆరవ జైన తీర్థంకరుడు భగవాన్ పద్మ ప్రభు పేరు పెట్టబడింది. తామర పువ్వు భంగిమలో తీర్థంకరుడి ఒక అందమైన విగ్రహం ఉంది. తామర పువ్వు భంగిమ ధ్యాన స్థితిని సూచిస్తుంది.
ఈ ఆలయంలో 85 అడుగుల తెల్ల పాలరాయి శిఖరం మరియు సృజనాత్మక వేదాలతో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అంతే కాకుండా 1008 భగవాన్ పద్మప్రభు యొక్క భారీ విగ్రహం ఆకాశం వైపు గంభీరముగా ఉంటుంది. ఆలయంలో ఆధ్యాత్మికత భావన కనిపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ సందర్శనకు వచ్చిన పర్యాటకులకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
మీరు పద్మ ప్రభు దేవాలయం సందర్సించినప్పుడు దానికి సమీపంలో ఉన్న కారా మరియు మంఝాన్పూర్ లో కమసిన దేవి ఆలయం ,శీతల మాతా దేవాలయం లను తప్పక చూడండి.



Click it and Unblock the Notifications