ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని ఉత్తమ మ్యూజియం లలో ఒకటిగా ఉన్న మహంత్ ఘసిదాస్ మ్యూజియం రాయ్ పూర్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది నగరంలోని D.K.హాస్పిటల్ సమీపంలో ఉంది.
ఈ మ్యూజియాన్ని 1875 లో రాజ మహంత్ ఘసిదాస్ నిర్మించారు. ఈ రెండంతస్థుల భవనం 1953 లో రాణి జ్యోతి దేవి, ఆమె కుమారుడు దిగ్విజయ్ దాస్ చే పునర్నిర్మించబడింది. ఇది రెండు హెక్టార్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఆయుధ నమూనాలు, పురాతన నాణాలు, శాసనాలు, శిల్పాలు, బొమ్మలు మొదలైనవి ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తారు.