ఛత్తీస్గడ్ లోని ‘ప్రయాగ్’ గా ప్రసిద్ది చెందిన రజిం, రాష్ట్రంలోని రాయ్ పూర్ జిల్లా నుండి షుమారు 45 కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న ఒక చిన్న పట్టణం, ఇది మహానది నది తూర్పు ఒడ్డుపై ఉంది. రజిం సంపన్న వారసత్వం పర్యాటకులలో, అలాగే చారిత్రికులలో ఆశక్తిని ఏర్పరచింది. రజిం వద్ద అనేక యాత్రాస్థలాలు ఉన్నాయి, ఇక్కడి నదులు పవిత్రమైనవిగా భావించబడతాయి.
మహానది, పైరి, సొండుర్ నదుల కలయికని త్రివేణీ సంగమం అంటారు, ఇది పవిత్ర స్థలంగా పేరుగాంచింది. రజిం పట్టణం సందర్శనకు విలువైన చారిత్రిక కట్టడాలను కలిగి ఉంది. J.D.బెగ్లార్, అలెగ్జాండర్ కన్నింఘం వంటి చారిత్రిక ప్రముఖులు రజిం ని సందర్శించారని ఆధారాలు చెప్తున్నాయి, వీరు వారి రచనలలో ఈ పట్టణం గురించి విస్తృతమైన వివరణలు ఇచ్చారు.
రజిం లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు
ప్రధాన ధార్మిక ప్రదేశమైన రజిం, పర్యాటకులు సందర్శించే అనేక ఆలయాలు, చారిత్రిక కట్టడాలను కలిగి ఉంది. రాజీవ్ లోచన్ ఆలయం రజిం లోని ప్రధాన ఆకర్షణ. అందమైన భావన నిర్మాణం గల ఈ ఆలయం ఏడాది పొడవునా అనేకమంది సందర్శకులను ఆకర్షిస్తుంది. కులేశ్వర మహాదేవ మందిర౦, రామచంద్ర ఆలయం, చంపారణ్ రజిం వద్ద ఉన్న ఇతర ఆలయాలు.
రజిం వాతావరణం
రజిం ఏప్రిల్ చివరి నుండి జూన్ నెల వరకు ఉండే రజిం ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రత షుమారు 40 డిగ్రీలు ఉంటుంది. శీతాకాలంలో, ఉష్ణోగ్రత గుర్తించడానికి వీలులేనంత పడిపోతుంది.
రజిం చేరుకోవడం ఎలా
రజిం రోడ్డు, రైలు మార్గాలద్వారా చేరుకోవచ్చు, ఛత్తీస్గడ్ లోని అధిక ప్రాంతాల నుండి బస్సులగుండా కూడా వెళ్ళవచ్చు.