ఈ ప్రాంతంలో దీవాలి, హోలీ, దుర్గా పూజ, ఈద్ వంటి అన్ని ప్రధాన పండుగలను ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. ఇక్కడ సిక్కుల జనాభా ఎక్కువగా ఉండడం వల్ల, ఇక్కడ వైసాఖి, గురు గోవింద్ సింగ్ గురుపర్వ మొదలైన అనేక సిక్కుల పండుగలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ బహుళ మతస్తులు ఉండడం వల్ల భిలాయ్ ని “మినీ ఇండియా” అనికూడా అంటారు.
భిలాయ్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు
మైత్రి బాగ్, సివిక్ సెంటర్, కాలిబరి మొదలైనవి భిలాయ్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలు. మైత్రి బాగ్ ఒక జంతుప్రదర్శన శాల, ఇక్కడికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారు. ఈ ప్రాంతం ఎక్కువగా పారిశ్రామిక ప్రదేశం. ఇక్కడ అనేక చిన్న ఆలయ ప్రాంగణాలు ఉన్నాయి.
భిలాయ్ వాతావరణం
భిలాయ్ వేసవిలో వేడి, శీతాకాలంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది.
భిలాయ్ చేరుకోవడం ఎలా
భిలాయ్ రోడ్లు, రైలు, వాయు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.