పర్యాటకులు వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలలో ఇక్కడకు చేరవచ్చు. విమాన ప్రయాణం జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం రణధంబోర్కు సమీప విమానావ్రయంగా ఉంది. సుమారు 152 కి.మీ.ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం, దేశంలోని ప్రధాన నగరాలకు అంటే, న్యూఢిల్లీ, ముంబై, కోల్ కటాలకు కలుపబడింది. విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతానికి రావాలంటే, న్యూఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంనుండి సంగనేర్ విమానాశ్రయానికి చేరి అక్కడనుండి రణధంబోర్ కు టాక్సీలలో చేరవచ్చు.