ఉత్తర భారత దేశంలో రణధంబోర్ నేషనల్ పార్క్ అతి పెద్ద అటవీ రిజర్వులు కలిగి ఉంది. ఒకప్పుడు ఈ అడవులలో రాజుల వేటలు సాగేవి. 1955 లో ఇది వన్య అభయారణ్యంగా స్ధాపించారు. 1980 సంవత్సరంలో ఱణధంబోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కి నేషనల్ పార్క్ హోదా కలిగించారు. ఇక్కడ పులులే కాక వివిధ...
రణధంబోర్ కోట చాలా బలిష్టమైనది దీనిని క్రీ.శ.944 లో నిర్మించారు. కొండపై భాగంలో 700 అడుగుల ఎత్తున ఉంటుంది. వింధ్య పీఠభూమి, ఆరావళి పర్వ శ్రేణులు కలిసే ప్రదేశంలో కలదు. సుమారు 7 కి.మీ. వ్యాసంలో విస్తరించి ఉంది. ఈ కోటలో అనేక హిందు మరియు జైన దేవాలయాలు, ఒక మసీదు కూడా...
సుర్వాల్ సరస్సు ఒక అందమైన సీజనల్ సరస్సు. ఇది రణధంబోర్ కు 25 కి.మీ.ల దూరంలో కలదు. పక్షులకు ఇది స్వర్గం. ఈ సర్సు అందాలు నవంబర్ నుండి మార్చి వరకు గల సమయంలో పర్యాటకులను ముగ్ధులను చేస్తాయి. చలికాలంలో అనేక వలస పక్షులు అంటే పెలికాన్లు, కొంగలు, బాతులు ఫ్లెమింగోలు వస్తాయి....
రణధంబోర్ నేషనల్ పార్క్ లో పదం తలావ్ సరస్సు అతి పెద్దది, సుందరమైనది. ఈ సరస్సు ఒడ్డునే జోగి మహల్ గెస్ట్ హౌస్ కలదు. ఉదయం మరియు సాయంకాలలో పర్యాటకులు వన్య జంతువులు ఈ సరస్సు వద్దకు రావటం చూస్తారు. ఫొటోగ్రఫీ తీయాలనుకునేవారికి ఈ సమయాలు అనుకూలం.
బాదల్ మహల్ ను మేఘాల భవనం అని అంటారు. ఇది రణధంబోర్ కోటలో కలదు. కోటలో ఉత్తర భాగాన కలదు. ఇపుడు ఈ మహాల్ శిధిలావస్ధలో ఉన్నప్పటికి కోట అందాన్ని కాపాడుతోంది. రాజు హమ్మీర్ చే నిర్మించబడిన 84 స్తంభాల ఛత్రి నేటికి బహు సుందరంగా ఉంది. రాజు ఇక్కడనుండి తన ప్రజలకు...
జోగి మహల్, రణధంబోర్ కలొండ దిగువ భాగంలో ఉంటుంది. దీనిని జైపూర్ రాజ కుటుంబాలు నిర్మించారు. చాలా తరాలు దీనిని వారి వేటల విడిదిగా వాడుకునేవి. ఈ అటవీ గెస్ట్ హౌస్ పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కలిగిస్తుంది. జోగి మహల్ నుండి పదం తలావ్ సరస్సు చూడవచ్చు. ఇక్కడే ఒక అతి పెద్ద...
రాజ్ బాగ్ శిధిలాలు అంటే ఇక్కడకల ఆర్చీలు, భవనాలు, డోమ్ లు, బురుజులు మొదలైనవి చాలా ప్రాచీనమైనవి. ఈ ప్రదేశం రాజ్ బాగ్ తలావ్ సరస్సుకు మరియు పదం తలావ్ సరస్సుకు మధ్య కలదు.
మాలిక్ తలావ్ నేషనల్ పార్కులో కలదు. ఈ సరస్సులు పార్కు పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. అక్కడి జంతువులకు, పక్షులకు నీటిని, ఆహారాన్ని అందిస్తున్నాయి. వివిధ రకాల పక్షులు ఇక్కడకు వలసలు వస్తాయి. అపుడపుడూ పులులు సైతం ఈ సరస్సు వద్దకు వస్తాయి.
రణధంబోర్ నేషనల్ పార్క్ వెలుపలి భాగంలో కచిడా వ్యాలీ కలదు. ఈ వ్యాలీలో ఎన్నో రకాల వన్య సంపద కలదు. పార్క్ కు చెందిన చిరుతలు ఇక్కడ సంచరిస్తాయి. పర్యాటకులు, అడవి ఎలుగు, జింగ వంటి వాటిని తరచుగా చూడవచ్చు. పర్యాటకులు సఫారి జీపులు ఉపయోగించి కచిడా వ్యాలీ అందాలు దర్శించే...
రణధంబోర్ నేషనల్ పార్కుకు వాయువ్యంగా మరియు ఉత్తరంగా ఈ ప్రదేశం కలదు. ఇక్కడ తేనె తుట్టెలు మరియు తాజా పండ్లు దొరకటంతో కొన్ని శాకాహార జీవులు అధికంగా సంచరిస్తాయి. ఇక్కడి వాతావరణం ఎలుగుబంట్లకు అనుకూలం. కోతులు, హయనాలు, ముళ్ళ పందులు కూడా సంచరిస్తాయి.
సవాయ్ మాధోపూర్ వద్ద గల రణధంబోర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ టైగర్ ప్రాజెక్టు గురించి వివరించేందుకు స్ధాపించబడింది. ఈ స్కూలులో విద్యార్ధులు సమీప పట్టణం, గ్రామాల వారే. స్కూలు, టీచర్లు, విద్యార్ధులు తయారు చేసిన గ్రేట్ ఇండియన్ టైగర్ చిత్రాలను ప్రదర్శించటం అమ్మటం చేస్తుంది. ఈ...