రణధంబోర్ కోట చాలా బలిష్టమైనది దీనిని క్రీ.శ.944 లో నిర్మించారు. కొండపై భాగంలో 700 అడుగుల ఎత్తున ఉంటుంది. వింధ్య పీఠభూమి, ఆరావళి పర్వ శ్రేణులు కలిసే ప్రదేశంలో కలదు. సుమారు 7 కి.మీ. వ్యాసంలో విస్తరించి ఉంది. ఈ కోటలో అనేక హిందు మరియు జైన దేవాలయాలు, ఒక మసీదు కూడా ఉన్నాయి. వివిధ రకాల స్ధానిక మరియు వలస పక్షులు ఇక్కడకల నీటి సరస్సుల వద్ద కనపడతాయి. కోట సందర్శన చేసేవారు రణధంబోర్ నేషనల్ పార్కు కూడా చూడవచ్చు. ఈ చారిత్రక భవనం 1528 ప్రాంతంలో మొగలాయిల చేతులలో ఉండేది. సుమారు 17వ శతాబ్దంలో మొగలాయిలు ఈ కోటను జైపూర్ మహారాజుకు బహుమతిగా ఇచ్చారు.