కరౌలి రాజస్ధాన్ రాష్ట్రంలో ఒక జిల్లా ఇది జైపూర్ కు 160 కి.మీ.ల దూరంలో కలదు. సుమారు 5530 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గతంలో దీనిని అక్కడకల ప్రముఖ దేవత కళ్యాణి పేరుపై కళ్యాణపురి అనేవారు. కరౌలిలో సుమారు 300 దేవాలయాలకు పైగా ఉండటంతో రాజస్ధాన్ లో ఈ జిల్ల ఎంతో పవిత్ర స్ధలంగా పేరు పడింది. ప్రాచీన కాలంలో ఈ ప్రదేశంపై అనేక దండయాత్రలుండటంతో జిల్లా మొత్తాన్ని ఒక కోటవలే నిర్మించారు. ఎర్రటి రాతితో గోడలు ఎత్తుగా నిర్మించారు. ఇపుడవి కొంతమేరకు శిధిలం అయి కనపడతాయి. ఈ గోడకు 6 ప్రవేశపు గేట్లు మరియు వివిధ ప్రదేశాలలో బురుజులు వంటివి కోటను బలంగా ఉంచాయి.
కరౌలి దాని కొండలు, లోయలతో సముద్ర మట్టానికి సుమారు 902 అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రదేశంలో అధిక ఎత్తు కల శిఖరం 1400 అడుగుల ఎత్తు. ఇతిహాసాల మేరకు ఈ రాష్ట్రం సుమారు క్రీ.శ 995 లో శ్రీ క్రిష్ణుడి వంశానికి చెందిన 88వ రాజు రాజా బిజయ్ పాల్ జేడన్ కనుగొన్నాడు. అయితే అధికారికంగా మాత్రం దీనిని క్రీ.శ. 1348 లో యాదవ వంశ రాజపుత్రుడైన రాజా అర్జున్ పాల్ కనుగొన్నట్లు తెలుస్తోంది. కరౌలి జిల్లా దాని ఎర్రటి రాతి శిల్ప శైలికి ప్రసిద్ధి చెంది వివిధ బ్రహ్మాండమైన చారిత్రక కట్టడాలు అంటే సిటీ ప్యాలెస్, తిమ్మన ఘర్ కోట, కైలా దేవి దేవాలయం, మదన్ మోహన్ జీ దేవాలయం, మహావీర్ జైన్ దేవాలయం మొదలైనవి కలిగి ఉంది. సిటి ప్యాలెస్ ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఒక వారసత్వ సంపద.
జాతర్లు, పండుగలు
ఉత్తర భారతంలో జాతర్లు అధికంగా చేస్తారు. కైలా దేవి దేవాలయంలో చైత్ర మాసం అంటే మార్చి ఏప్రిల్ నెలలలో పదిహేనురోజుల కొక జాతర చేస్తారు. ఈ సమయంలో పర్యాటకులు దూర ప్రదేశాలనుండి కూడా వస్తారు. మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాలనుండి కూడా వచ్చి మాత ఆశీస్సులు పొందుతారు. కరౌలిలో స్ధానికులు హస్త కళలే తమ నైపుణ్యంగా భావించి తమ జీవనం సాగిస్తారు. కరౌలి ఎలా చేరాలి?
జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం మరియు గంగాపూర్ రైలు స్టేషన్ కరౌలి చేరేందుకు అనుకూలంగా ఉంటాయి. రోడ్డు ప్రయాణంలో కూడా వివిధ ప్రదేశాలనుండి సౌకర్యవంతంగానే చేరవచ్చు. కరౌలి సందర్శనకు సెప్టెంబర్ నుండి మార్చి వరకు అనుకూలం.