ఈ దేవాలయాన్ని మహారాజు గోపాల్ సింగ్ సుమారు 200 సంవత్సరాల కిందట నిర్మించారు. ఈ దేవాలయంలో కళ్యాణి పాతా ఉంటుంది. కరౌలిని ఈ దేవాలయం పేరుపై మొదట్లో కళ్యాణపురి అని పిలిచేవారు. ప్రాచీన దేవాలయ శిల్ప సంపద అద్భుతంగా ప్రదర్శించబడుతోంది.. కరౌలి అభివృధ్ధి చెందటానికి ఇక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం గడపటానికి ఈ దేవాలయం కారణమని స్ధానికులు భావిస్తారు.