అర్కావతి, కావేరి నదులు కలిసే ఈ సంగం మేకేదాటు ప్రాంతంలో కల సంగమేశ్వర దేవాలయం చూడదగినది. సంగమేశ్వరుడు అంటే, శివుడి మరో రూపం. దత్త భక్తులకు ఈ దేవాలయం ఎంతో పవిత్రమైనది. పరమ గురు మాత జయ లక్ష్మి ఈ సంగమేశ్వర దేవాలయంలో తపస్సు చేసిందని చెపుతారు. 2007 లో ఈ దేవాలయం అవధూత దత్త పీఠం చే పునరుద్ధరించబడింది. గోడలకు గ్రానైట్ రాళ్ళు అతికించారు. ప్రహరీ గోడ చుట్టూ చక్కటి ఫెన్సింగ్ అమర్చారు. దేవాలయ భధ్రతను పరిరక్షించారు.