భార్హుట్ స్తూపం నాగోడ్ మాజీ రాష్ట్రంలో ఉంది, ప్రస్తుతం ఇది మధ్యప్రదేశ్ సాట్నా జిల్లలో ఉంది. 150 BCలో నిర్మించిన ఈ భార్హుట్ స్తూపం చక్కగా క్షుణ్ణంగా పరిశీలించి నిర్మించబడింది, పురాతన భారతదేశ సంపన్న సంస్కృతికి నిదర్శనంగా నిలబడింది. ఈ స్తూపం ఇది నిర్మించబడిన కాలం నాటి చిరస్మరణీయ గాధలను వివరిస్తుంది.
ఇది బుద్ధ ప్రయాణ౦ లోని జ్ఞాన బోధలను, యక్షుల, ఈ కాలపు రోజువారీ జీవిత వివరాలను, ఇటువంటి అనేక చిన్న చిన్న విషయాలకు చెందిన కధలను చెపుతుంది. భార్హుట్ స్తూప మెట్లు ఎర్ర రాయితో అద్భుతంగా చేక్కబడడం వల్ల దాని అందం ద్విగుణీక్రుతమైంది. నేడు అది పునరావశేషాల ప్రసిద్ధ స్థలంగా ఉంది. భార్హుట్ స్దూపాలలోని కొన్ని కోల్కతా లోని మ్యూజియంలో సంరక్షించబడుతున్నాయి. అయితే, భార్హుట్ ఆర్ట్ గ్యాలరీ అనుకరణలు, చిత్రాల వర్ణనల ద్వారా స్థూప శోభను ప్రదర్శిస్తుంది.



Click it and Unblock the Notifications