ఈ ఆలయం సురియనార్ కోయిల్ లో ఉంది. శివసూర్యనారాయణ ఆలయంలో సూర్యుని విగ్రహం ఉంది, ఇది తమిళనాడు లోని నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో మిగిలిన ఎనిమిది గ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. కలవ మునివర్ తానూ త్వరలో కుష్టు వ్యాధికి గురౌతానని అంచనా వేసి చెప్పాడని చెప్తారు.
అందువల్ల అతడు ఆ రోగం నుండి రక్షించబడటానికి నవగ్రహాలని ప్రర్ధించాలని నిర్ణయించుకున్నాడు. నవగ్రహాలు అతని అంకితభావానికి సంతోషపడ్డారు, వారు అతని కొరికను విన్నారు. అయినా అతని విధి మారలేదు, ఎవరూ దానిని సరిచేయలేదు, అపుడు బ్రహ్మదేవుడు ఇది విని చాలా కోపోద్రిక్తుడై, కలవ మునివర్ అనుభవించిన బాధలు 9 గ్రహాలు అనుభవించాలని శపించాడు. అప్పటినుండి నవగ్రహాలన్నీ కుష్టు తో బాధపడ్డాయి.
తరువాత, నవగ్రహాలు బ్రహ్మతో ఇదంతా మర్చిపోయి, ఈ శాపాన్ని అధిగమించే మార్గాన్ని చెప్పమన్నారు. తిరుమంగలకుడి సందర్శించి, ప్రాణనాదేశ్వర్ (వెల్లెరుక్కకడు వద్ద) ను పూజించమని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. ప్రాణనాదేశ్వర్, మంగలామ్బిగై (ఆయన భార్య) కు ప్రార్ధనలు చేసిన తరువాత నవగ్రహాల స్థానానికి దగ్గరలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచుతారు, ఈ ప్రదేశంలో తపస్సు ప్రారంభించారు.
దేవుని ఆశీర్వాదం వల్ల, నవగ్రహాలు పాప విమోచనం (వారి పాపానికి విమోచన) పొందాయి. కలవ మునివర్ నవగ్రహాలకు తన కృతజ్ఞతను తెలుపుకోవడానికి నవగ్రహాలు తపస్సు చేసిన ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో, ప్రధాన దేవత శివసూర్యనారాయణ తన ఇద్దరు భార్యలు ప్రత్యూష, ఉష తోపాటు (సూర్యుడి రధాన్ని సూచించే) రాదోత్సవానికి నిలబడ్డారు. విజయ దశమి, రథ సప్తమి పండుగల సమయంలో అనేకమంది భక్తులు ఈ ఆలయానికి గుంపులుగా వస్తారు.



Click it and Unblock the Notifications