శివాలయమైన అమ్బ్రేశ్వర్ దేవాలయాన్ని 11 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ శివాలయం థానే కు 26 కిలోమీటర్ల దూరంలో అమ్బర్నాద్ లో ఉంది. అమ్బర్నాద్ అనగా “ఆకాశ దేవత” అని అర్ధం. శిలాహర్ వంశానికి చెందిన మహామందలేశ్వర్ రాజు చే క్రీ.శ. 1060 నిర్మించ బడిన ఈ పురాతన దేవాలయం వధూని నది వడ్డున ఒక బంజరు కొండ వాలుపై ఉంది.ఈ దేవాలయ నిర్మాణం హేమండ్పతి రీతిలో గల వాస్తు శైలిలో చెక్కబడింది. దీనికి ప్రధానంగా సున్నము, నల్ల రాయిని వాడారు.ఈ దేవాలయ సభా మందిరానికి ఉత్తర, దక్షిణ పడమర దిక్కులలో మూడు ద్వారములు వున్నాయి. పడమటి దిక్కున గల ప్రధాన ద్వారము ముందు నంది విగ్రహం ఉంది.ఈ దేవాలయ స్తంభాల గోడలపై ఒక ప్రత్యేకమైన శైలితో చెక్కిన శివుడు, ఆయెన కుమారుడు గణపతి, ఆయెన వాహన ఆధారమైన నంది చిత్రాలు కలవు.ఇక్కడ ప్రధాన పండగ శివరాత్రిని అకు౦ఠిత విశ్వాసంతో జరుపుకుంటారు. తీర్థ స్థలమైన అమ్బర్నాద్ ప్రతీ ఏటా ఈ రోజున వేలాదిమంది భక్తులతో నిండి ఉంటుంది. ఈ దేవాలయం ప్రస్తుతం భారతదేశ పురావస్తు శాఖ వారి నిర్వహణలో వుంది.



Click it and Unblock the Notifications