భారతీయ ఆధ్యాత్మిక పర్యాటకంలో శృంగేరి లోని శారదా పీఠం, అక్కడే ఉన్న శారదా మాత దేవాలయం సందర్శన మొదటి జాబితాలో ఉంటుంది. కర్నాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్ర సందర్శన కోసం కన్నడిగులే కాకుండా భారత దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి నిత్యం భక్తులు వస్తుంటారు.
అయితే ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మంది శారదా మాత ఆలయాన్ని చూసి వెనుతిరుగుతుంటారు. అయితే ఈ శృంగేరికి దగ్గర్లోనే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందులో కైగా జలపాతం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఈ శృంగేరితో పాటు చుట్టు పక్కల చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన క్లుప్త వివరాలు మీ కోసం..

కైగా జలపాతం
P.C: You Tube
శృంగేరి కి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణమే కైగా. కైగా పచ్చటి అడవులతో నిండి ఉండటంతో ఫొటోగ్రఫి అంటే ఇష్టపడే వారికి ఈ కైగా స్వర్గధామం. అంతే కాకుండా చిన్నటి జలపాతాలతో కూడిన ఈ ప్రాంతం ట్రెక్కింగ్ కు అనుకూలం

శృంగేరి మఠం
P.C: You Tube
శృంగేరి మఠాన్ని ఆదిశంకరాచార్యలు 8 వశతాబ్దంలో ఏర్పాటు చేశారు. భారత దేశంలో ఉన్న నాలుగు విశిష్టమైన పీఠాల్లో శృంగేరి మఠం మొదటిది. భారతీయ సంప్రదాయాలు, వేదాలు, ధర్మాలు పరిరక్షణ ఈ పీఠం ముఖ్య ఉద్దేశం. ఈ మఠంలో శారదాదేవిని ప్రధానంగా ఆరాధిస్తారు.

హొరనాడు
P.C: You Tube
శృంగేరి నుంచి కేవలం 42 కిలోమీటర్ల దూరంలోనే ఈ హెరనాడు ఉంటుంది. పచ్చటి అడవి మధ్యలో ఉన్న ఈ హెరనాడులో అన్నపూర్ణేశ్వరి కొలువై ఉన్నారు. ఇక్కడ కాఫీ, టీ తోటలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్షేత్రంలోని అన్నపూర్ణేశ్వరిని దర్శించుకోవడం వల్ల దారిద్రం దరిచేరదని భక్తులు నమ్ముతారు.

శారదామాత దేవాలయం
P.C: You Tube
ఈ శారదామాత దేవాలయ నిర్మాణం ఆదిశంకరాచార్యుల ఆధ్వర్యంలో ప్రారంభమయ్యిందని చెబుతారు. దక్షిణ భారత దేశ వాస్తు శైలి ఈ దేవాలయంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని రాతి స్తంభాల పై అనేక శిల్పాలు మనకు భారతీయ శిల్పకళా వైభవాన్ని చాటి చెప్పుతాయి.

విద్యాశంకర దేవాలయం
P.C: You Tube
విద్యాశంకర దేవాలయం కూడా శృంగేరి లో చూడదగిన ప్రదేశం. పీఠాధిపతి విద్యాశంకర్ సంస్మరణార్థం ఈ దేవాలయాన్ని నిర్మించారు. విజయ నగర రాజులు నిర్మించిన ఈ దేవాలయం కూడా శిల్పకళ కాణాచి. వీటితో పాటు తోరణగణపతి, కెరే ఆంజనేయ స్వామి దేవాలయం, ఆదిశంకర దేవాలయం దర్శించదగినవి.



Click it and Unblock the Notifications













