బుద్ధుని జ్ఞానోదయ ప్రదేశం.. బోధ్ గయా
బోధ్ గయా ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన బౌద్ధ యాత్రా స్థలం. ఇది భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఉంది. ఇది మహాబోధి ఆలయ సముదాయంలో ఒకటి. ఇక్కడే బుద్ధుడు బోధి వృక్షం క్రింద ధ్యానంలో జ్ఞానోదయం పొందాడు. విశాలమైన మహాబోధి ఆలయ సముదాయం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
చాలా ప్రశాంతమైన ఈ ప్రదేశానికి ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సన్యాసులు పవిత్ర గ్రంథాలు చదువుతూ, దీర్ఘమైన ధ్యానంలో గడుపుతూ ఉంటారు. ఈ పట్టణంలో డజన్ల కొద్దీ బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. వీటిని వివిధ బౌద్ధ దేశాలు నిర్వహిస్తాయి. ప్రతి సంవత్సరం బోధ్ గయాను సందర్శిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

థాయ్ ఆలయం అస్సలు మిస్వవ్వొద్దు
అద్భుత నిర్మాణ శైలితో చెక్కబడిన మహాబోధి ఆలయం బౌద్ధమతం యొక్క అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా, బోధ్ గయాలో పెద్ద ఆకర్షణగా ప్రసిద్ధిపొందింది. ఈ ఆలయం 2002లో UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. ఇది ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే, నిత్యం ఉదయం 5:30 మరియు సాయంత్రం 6 గంటలకు మంత్రోచ్ఛారణ మరియు ధ్యానం జరుగుతుంది. వివిధ బౌద్ధ దేశాలచే నిర్మించబడిన మరియు నిర్వహించబడుతున్న ఇతర దేవాలయాలు, మఠాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.
ముఖ్యంగా విభిన్న నిర్మాణ శైలితో బంగారంతో మెరిసిపోతున్న థాయ్ ఆలయ సందర్శన అస్సలు మిస్సవ్వకూడదు. ఇది ఉదయం 5 నుండి మధ్యాహ్నం వరకు మరియు మధ్యాహ్నం 2 నుండి 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. 80 అడుగుల ఎత్తయిన ఇసుకరాయి మరియు గ్రానైట్తో చెక్కబడిన బుద్ధుని విగ్రహం తప్పక చూడదగినది. ఇది పూర్తి చేయడానికి 12,000 మంది కార్మికులకు ఏడేళ్లు పట్టింది.

అనుకూలమైన వాతావరణంలో..
బోధ్ గయాలో పురావస్తు మ్యూజియం కూడా ఉంది. ఇందులో బుద్ధుని అవశేషాలు, గ్రంథాలు మరియు పురాతన విగ్రహాలను ప్రదర్శనకు ఉంచుతారు. ఇది శుక్రవారాల్లో మూసివేయబడుతుంది. అలాగే, బుద్ధ జయంతి, ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరిలో లేదా మే నెలలో పౌర్ణమి రోజున నిర్వహించబడుతుంది. బోధ్ గయాలోని ఇతర పండుగలలో వార్షిక బుద్ధ మహోత్సవం ఒకటి. మూడు రోజులపాటు సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాలతో వేడుకలు జరుపుతారు. ఈ సమయంలో బోధ్ గయా ఇప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వాతావరణం సందర్శించడానికి ఉత్తమ సమయం. జూన్ మరియు సెప్టెంబర్ మధ్య సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం ఇక్కడి వాతావరణమే.
బోధ్ గయా వద్ద విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి ఫ్లాష్లైట్ని తీసుకెళ్లడం మంచిది. అలాగే, ప్రధాన మహాబోధి ఆలయ సముదాయంతోపాటు చుట్టుపక్కల ఉన్న ఏదైనా మఠాల లోపలికి ప్రవేశించే ముందు బూట్లు తీయడం సంప్రదాయం. వదులుగా ఉండే గౌరవప్రదమైన దుస్తులు మరియు సాధారణ చెప్పులు ధరించడం ఉత్తమం. ఈ పట్టణం పెద్దగా ఉండదు కనుక కాలినడకన లేదా సైకిల్పై హాయిగా విహరించవచ్చు.

ఎలా చేరుకోవాలి?
గయా విమానాశ్రయం ఇక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇతర ప్రధాన నగరాల నుండి వెళ్లేవాళ్లకు సమీప విమానాశ్రయం పాట్నాలో ఉంది. ఇది 140 కిలోమీటర్లు (87 మైళ్ళు) దూరంలో ఉంది. పాట్నా నుండి మూడు నుండి నాలుగు గంటల ప్రయాణం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. బోధ్ గయా రైలు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్ గయా. ఇది పాట్నా, వారణాసి, న్యూఢిల్లీ , కోల్కతా, పూరి మరియు బీహార్లోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. పాట్నా నుండి రైలులో ప్రయాణం సుమారు రెండున్నర గంటలు పడుతుంది.



Click it and Unblock the Notifications















