ధ్వజధారి పర్వతంపై కొలువైన పర్యాటక కేంద్రం.. ఝుమ్రీ తెలయ్య
చుట్టూ దట్టమైన అడవులు.. ఎత్తయిన పర్వతాలు.. అపురూపమైన ఖనిజ సంపద సమృద్ధిగా నిండిన నేలలు ఝుమ్రీ తెలయ్య సొంతం. ధ్వజధారి పర్వతంపై కొలువైన ఉన్న ఈ ప్రకృతిసిద్ధమైన ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఇక్కడి నుంచే వివిధ్ భారతికి పాటల అభ్యర్థనలు పంపేవారు.
రేడియోతో పరిచయం ఉన్నవారికి ఝుమ్రీ తెలయ్య అభిమాన ప్రాంతమనే చెప్పాలి. కానీ నేడు దాదాపు అందరూ ఈ స్థలాన్ని మర్చిపోయారు. ఈ కథనంలో, పర్యాటకుల దృష్టిని ఆకర్షించే ఝుమ్రీ తెలయ్య యొక్క ఉత్తమ ప్రదేశాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము.

ఝుమ్రీ తెలయ్య జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో ఉన్న ఓ పట్టణం. ఇది ఒకప్పుడు మైకా మైనింగ్కు ప్రధాన కేంద్రంగా ఉండేది. 1890వ దశకంలోనే కోడెర్మా మీదుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు బ్రిటీష్వారు ఈ ప్రాంతంలో మైకా నిక్షేపాలను కనుగొన్నారు. ఇక్కడ చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధమ స్థానంలో ఉంటుంది తలైయా ఆనకట్ట. ఈ సీజన్లో సందర్శించడానికి అత్యంత ప్రసిద్ధ ప్రదేశం ఏదైనా ఉంటే, అది ఈ డ్యామే. దాదాపు 1200 అడుగుల పొడవు మరియు 99 అడుగుల ఎత్తు ఉన్న ఈ డ్యామ్ని చూడటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. వర్షాకాలంలో ఇక్కడి అందాలు రెట్టింపు అవుతాయని చెబుతారు.
స్థానిక గిరిజనులు ఈ డ్యామ్లో చేపలు పడుతూ అక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహారంగా కూడా అందిస్తారు. స్వచ్చమైన అటవీ ప్రాంతంలో లభించే ప్రకృతిసిద్ధమైన చేపల రుచిని మాటల్లో చెప్పడం కష్టమే. ఈ డ్యామ్ చుట్టుపక్కల ప్రకృతి అందాలు కూడా ప్రజలను ఆహ్లాదపరుస్తాయి. మీరు మొదటిసారి ఝుమ్రీ తెలయ్య వెళితేమాత్రం మరో అద్భుత ప్రపంచంలో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది.

కోడెర్మా రిజర్వ్ ఫారెస్ట్
ఝుమ్రీ తెలయ్య ఒక గిరిజన గ్రామమని, ఇక్కడి ప్రజలు ప్రకృతిసిద్ధమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారని గ్రహించాలి. ఇక్కడ ఉన్న తల్లి చంచలా దేవి ఆలయం స్థానిక ప్రజలకు చాలా పవిత్రమైన ప్రదేశం. ఈ ఆలయాన్ని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. ఈ ప్రదేశం కొండపై ఉన్నందున పర్యాటకులలో కూడా ప్రసిద్ధి చెందింది. అటువంటి పరిస్థితిలో, మీరు ఝుమ్రీ తెలయ్యలోని ఏదైనా పవిత్ర ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే, మీరు ఇక్కడకు వెళ్లవచ్చు. పచ్చదనం నిండిన కొండకోనలు చూపరులను రారమ్మని ఆహ్వానిస్తాయి.
పైనుంచి జాలువారే స్వచ్ఛమైన నీటి సవ్వడులు చూడముచ్చటి ఆహ్లాదాన్ని చేరువచేస్తాయి. తలైయా డ్యామ్, కోడెర్మా రిజర్వ్ ఫారెస్ట్ లేదా చంచల దేవి ఆలయాన్ని మాత్రమే కాకుండా సందర్శించడానికి అనేక ఇతర గొప్ప ప్రదేశాలను కూడా మనసారా తిలకించవచ్చు. పెట్రో జలపాతం, ఘోడ్సిమార్ ధామ్, ధ్వజధారి పహార్ మరియు ఝుమ్రీ తెలయ్యలో ఉన్న మకమారో కొండలను కూడా సందర్శించవచ్చు.

ఎలా చేరుకోవాలి?
ఝుమ్రీ తెలయ్య చేరుకోవడం చాలా సులభం. మీరు జార్ఖండ్లోని రాంచీ, ధన్బాద్, గిరిడిహ్ మొదలైన నగరాల నుండి ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. ఈ నగరాల నుండి ఝుమ్రీ తెలయ్యకు బస్సులు నడుస్తూనే ఉంటాయి. కోడెర్మా రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. మీరు విమానంలో వెళ్లాలనుకుంటే, రాంచీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, ఇక్కడ టాక్సీ లేదా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications













