కలియుగ దైవమైన వేంకటేశ్వరుడి విగ్రహంలో శ్రీమన్నారాయణుడి పది అవతారాలు కొలువై ఉన్నాయి. ఆ అరుదైన విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉంది. ఇటువంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆగమశాస్త్ర నిర్మితమైన ఆ విగ్రహం పొడవు 11 అడుగులు. కాళ్ల నుంచి నడుము వరకూ వరాహ, మత్య్స, కూర్మ రూపంలో ఉన్న విగ్రహంలో మిగిలిన ఏడు అవతారాలు కూడా చక్కగా ఒదిగిపోయాయి. ఇంతటి విశిష్టమైన విగ్రహాన్ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు ఆవిష్కరించారు. ఇదిలా ఉండగా ఈ ఆలయ నిర్మాణంతో పాటు ఈ విగ్రహ రూపకల్ప శిల్పి తదితర వివరాలన్నీ మీ కోసం ఈ కథనంలో....
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
ప్రపంచంలో మరెక్కడా మనకు ఇటువంటి మంగళ స్వరూపం కనిపించదు. అందువల్లే ఈ విగ్రహం నవ్యాంధ్ర రాజధాని అమరావతికే తలమానికం అని అంటారు.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
అదే శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి విగ్రహం. కలియుగ ప్రత్యక్షదైవంగా పిలువబడే శ్రీనివాసుడు ఇక్కడ దశావతారాల రూపంలో కొలువై ఉన్నాడు.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
ఒకే విగ్రహంలో ఆ శ్రీమన్నారాయణుడి పది అవతారాలు కలిగి ఉండటడం అన్నది ఇక్కడ విశేషం. ఇలాంటి విగ్రహం భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరెక్కడా ఉండదు.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
విజయవాడ, గుంటూరు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా సువిశాల మైదానంలో ఈ స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నంబూరు పంచాయతీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్స్ లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి నాలుగు ఉపాలయాలు కూడా ఉన్నాయి.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
అవి మహాలక్ష్మి, గణపతి, గరుడ ఆళ్వార్, విష్వక్సేనుడు. అందువల్లే ఈ క్షేత్రాన్ని దశావతరార శ్రీనివాస క్షేత్రంగా కూడా పిలుస్తారు.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
ఆలయ నిర్మాణం మొత్తం ఆగమ శాస్త్ర ప్రకారమే జరిగింది. విగ్రహాలను మలిచే స్థపతి, ఆలయాన్ని నిర్మించే శిల్పి ఇలా ప్రతి ఒక్కరూ ఆగమశాస్త్ర ప్రకారం విధులు నిర్వర్తించారు.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
శిల్పి రమణ దశావతార వేంకటేశ్వరుడి విగ్రహాన్ని మొదట చిత్రం గీసుకున్నాడు. దీనిని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి వి. సుబ్రహ్మణ్య ఆచార్యులు రాతితో ఈ ఆలయాన్ని నిర్మించాడు.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
ఇక తమిళనాడులోని కొయంబత్తూర్ కు సమీపంలోని తిరుమురుగన్ పూండిలో వాస్తవ్యుడైన స్థపతి ఎస్. కనకరత్నం, భూసమేత దశావతార వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ దేవి, గణపతి, విష్వక్సేనుడు, హయగ్రీవాచార్యుల విగ్రహాలను అద్భుతంగా మలిచాడు.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
వేంకటేశ్వర స్వామికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం సమీపంలో గరుడాళ్వార్, గణపతి ఉపాలయం సమీపంలోని విష్వక్సేనాళ్వార్ విగ్రహాలు రమణీయంగా కనిపిస్తాయి.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా అంగర గ్రామానికి చెందిన వీరభాబు సప్తదళ రాజగోపురానని, 60 అడుగుల 9 అంగుళాల ఎత్తైన ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా నిర్మించారు.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
దేవాలయానికి దిగువ భఆగంలో స్వామీజీ ప్రవచనాల కోసం వేదికతో కూడిన విశాలమైన మండపం కూడా మనం చూడవచ్చు. చుట్టూ పచ్చదనంతో దేవాలయ ఆవరణం హాయిగొల్పుతుంది.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
ఇక ఈ విగ్రహం ఎత్తు 11 అడుగులు. ఈ ఒక్క విగ్రహంలోనే శ్రీమన్నారాయణుడి 10 అవతారాలను దర్శించుకోవచ్చు. ఇంతటి ఎతైన విగ్రహం చూడటానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
శ్రీ వేంకటేశ్వర, నరసింహ, వరాహ ముఖాలతో, వామన, పరుశురామ, రామ, బలరామ, కల్కి అవతారాలు ఆయుధాలుగా మత్స్య, కూర్మ అవతారాలు దేహంగా దాల్చిన విలక్షణమైన ఏక శిలా విగ్రహం ఈ శ్రీ దశావతార వేంకటేశ్వర విగ్రహం.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
ఈ ఆలయాన్ని స్థానిక వ్యాపారకుటుంబీకులు ఎల్ఈపీఎల్ ప్రజెక్టు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ లింగమనేని రమేష్ కుటుంబీకుల కలల సౌధం ఈ దేవాలయం.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
తిరుమల శ్రీవారి భక్తుడైన రమేశ్ ప్రపంచంలోనే ప్రత్యేకత ప్రతిబింబించేలా ఈ దేవాలయాన్ని నిర్మించాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం వారి ఊహ ఇటీవల వాస్తవ రూపం దాల్చింది.
ఒకే విగ్రహంలో దశావతారాలు
P.C: You Tube
అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్మాణంతో పాటు విగ్రహ రూపకల్పన జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది.