అక్కన్న మాదన్న గుహల విశేషాలు మీకు తెలుసా?
ఆధ్యాత్మిక నగరంగా పేరుపొందిన బెజవాడలో ఎన్నో చారిత్రక, సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ వేసే ప్రతి అడుగులోనూ పురాతణ నిర్మాణాలు పలకరిస్తాయి. అందులో ప్రధానమైనవిగా అక్కన్న మరియు మాదన్న గుహలను చెప్పుకుంటారు. విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండ దిగువన ఉన్నాయి ఈ గుహలు. ఈ గుహలు 6, 7వ శతాబ్దాల చెందినవిగా చెబుతారు.
17వ శతాబ్దంలో అబుల్ హసన్ తానా షా ఆస్థానానికి చెందిన ఇద్దరు మంత్రులు ఇక్కడ పరిపాలించినప్పుడు ఈ గుహలకు పేరు పెట్టారు. ఈ గుహలు ప్రసిద్ధ హిందూ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులకు అంకితం చేయబడ్డాయి. ఇక్కడ ఉన్న తూర్పుముఖ గుహలు దీర్ఘచతురస్రాకారంలో ఉండి అష్టభుజి స్తంభాలపై ఉంటాయి. దిగువ అద్భుత శిల్ప నిర్మాణాలు ఉన్నాయి. ఇది స్తంభంతో త్రికణంగా ఉంటుంది. ఈ నిర్మాణాలు బౌద్ధ నమూనాలను ప్రదర్శిస్తాయి.

తెలుగు శాసనంతో..
ఇక్కడి ఎగువ మరియు దిగువ గుహలు ప్రత్యేకమైన నిర్మాణ రూపాన్ని కలిగి ఉంటాయి. ఐదు రకాల మెట్ల ద్వారా ఈ గుహలు అనుసంధానించబడ్డాయి. ట్రిపుల్ సెల్డ్ గుహలలో దేవతా విగ్రహాలు ఉన్నాయి. అక్కన్న మాదన్న గుహలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన రక్షిత స్మారక చిహ్నంగా ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తున్నాయి. ఇసుక రాతిలో చెక్కిన మరో పురాతన గుహలను త్రిమూర్తి గుహలంటారు. ఇక్కడ ఉన్న రెండు రాతి గదులలోని ఒక దానిలోనే సదా శివుడు లింగ రూపంలో కనపడతాడు.

మరొకటి ఖాళీగా ఉంటుంది. ద్వారపాలక విగ్రహాలు, విఘ్న నాయకుని రూపం గోడల పైన చెక్కబడ్డాయి. పక్కనే ఉన్న నల్లరాతి మండపం సుందర సూక్ష్మ చెక్కడాలతో బాటు తెలుగు శాసనంతో ఆకర్షిస్తుంది. మధ్యలో ఉన్న శాసన స్తంభము మహేశ్వరుని వివిధ రూపాలలో చూపుతుంది. హనుమంతుని ఆశీర్వదిస్తున్న సీతా రాములను కూడా ఈ స్తంభం పైన చూడవచ్చును.
గుహల గురించి ఆసక్తికర విషయాలు
ఎగువ గుహ బాగా సంరక్షించబడింది. అంతేకాదు, 7వ శతాబ్దానికి చెందిన ముఖ్యమైన శాసనాన్ని కలిగి ఉంది. దిగువ గుహలకు ఉత్తరాన చెక్కిన స్తంభాలు మరియు శిథిలావస్తలోని హిందూ దేవాలయాల అవశేషాలతో ఒక చిన్న ఉద్యానవనం ఉంది. అక్కన్న మాదన్న గుహలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన రక్షిత స్మారక చిహ్నాలు. వీటిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది.

అక్కన్న గుహలు విజయవాడలోని దుర్గామాత ఆలయానికి సమీపంలో ఉన్న పురాతన గుహాలయాలలో ఒకటి, మొదట బౌద్ధ గుహలు తరువాత హిందూ దేవాలయంగా రూపాంతరం చెందాయి. ఈ గుహలు కొండ దిగువన ఉన్నాయి, దాని పైన విజయవాడకు చెందిన ప్రసిద్ధ కనక దుర్గ ఆలయం ఉంది.
సమీపంలోని ప్రసిద్ధ ప్రదేశాలు
కనక దుర్గ గుడి
మొగల్రాజపురం గుహలు
ఉండవల్లి గుహలు
భైరవకోన గుహలు
గుహలకు ఎలా చేరుకోవాలి
బస్సు ద్వారా :- విజయవాడ పాత RTC బస్టాండ్ 2.5 కి.మీ దూరంలో ఉన్నాయి.
రైలు మార్గం :- గుహలకు సమీప రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్. ఇది మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటోలు, బస్సుల ద్వారా గుహకు చేరుకోవచ్చు.
విమాన మార్గం :- విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం గుహల నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుండి మీరు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications













