భారత్లో సందర్శించేందుకు ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ అత్యంత ఖరీదైన హోటల్, లగ్జరీ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇవి వాటి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. భారత్లోనే అత్యంత ఖరీదైన హోటల్ ఉదయపూర్లో ఉంది. అదే తాజ్ లేక్ ప్యాలెస్ ఇక్కడ కేవలం ఒక్క రాత్రి గడిపేందుకు అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రండి. ఈ హోటల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..
తాజ్ లేక్ ప్యాలెస్ పిచోలా సరస్సు మధ్యలోని ఒక అందమైన ప్రదేశంలో నిర్మించబడి ఉంది. ఈ హోటల్ రాజులు మరియు చక్రవర్తుల కాలం నుండి నిర్మించబడింది. పూర్వం ఇది చాలా అందమైన ప్యాలెస్గా ఉండేది. ఆ తర్వాత ఇది ఒక హోటల్గా రూపాంతరం చెందింది. ఈ హోటల్ ఒక చెరువు మధ్యలో ఉండడం వల్ల ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఈ ప్యాలెస్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మహల్లో ఒక రాత్రి బస చేయాలనుకుంటే మాత్రం దానికి అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

తాజ్ లేక్ ప్యాలెస్ చరిత్ర...
ఈ తాజ్ లేక్ ప్యాలెస్ను గతంలో జగ్ నివాస్ అని పిలిచేవారు. తాజ్ లేక్ ప్యాలెస్ మేవార్ రాజవంశానికి చెందిన మహారాణా జగత్ సింగ్ III ప్రత్యేకమైన ఆనంద నిలయంగా పరిగణించబడింది. 1743వ సంవత్సరంలో, మహారాణా సంగ్రామ్ సింగ్ II తన చిన్న కుమారుడు మహారాణా జగత్ సింగ్ను ఈ వేసవి ప్యాలెస్ జగ్మందిర్లో తన స్నేహితులతో కలిసి నివసించవచ్చా అని తండ్రిని అడిగాడు. దానికి మహారాణా సంగ్రామ్ సింగ్ ఒప్పుకోలేదు. ఒక ద్వీప ప్యాలెస్లో నివసించాలనుకుంటే, నువ్వు సొంతంగా ఎందుకు నిర్మించుకోలేవు అని అన్నాడు. దానికి మహారాణా జగత్ సింగ్ అవమానంగా భావించి, 1746లో తనే సొంతంగా ఓ ప్యాలెస్ని నిర్మించాడు. ఆ ప్యాలెస్కు 'జగ్ నివాస్' అని పేరును కూడా పెట్టాడు. అదే మహారాణా జగత్ సింగ్ ఇల్లు.

మహారాజా సూట్లో ఒక రాత్రి బస
మహారాజా ప్యాలెస్లో బస చేయాలంటే ఒక రాత్రి అద్దె దాదాపు రూ. 3.5 లక్షల రూపాయల వరకూ ఉంటుంది. తాజ్ లేక్ ప్యాలెస్ హోటల్లో 65 గదులు, 18 గ్రాండ్ సూట్లతో లేక్ పిచోలాలో ఉంటుంది. ఈ అద్భుతమైన హెరిటేజ్ హోటల్లో 24 గంటల ఫిట్నెస్ సెంటర్, ఆటల గది, షాపింగ్ ఆర్కేడ్, వ్యాపార కేంద్రం వంటి అనేక ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి గదులన్నింటిని చెక్క ఫర్నీఛర్తో నిర్మించారు. విలాసవంతమైన పట్టు బట్టలతో అలంకరించబడ్డారు. ప్రతి గది సరస్సు లేదా తోట పర్యాటకులకు అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. ఇక్కడి ప్రతి గదిలో ఫ్లాట్ స్క్రీన్ టీవీ, DVD ప్లేయర్లు ఉంటాయి. అంతేకాకుండా ప్రతి గదిలో బాత్టబ్, షవర్, అవసరమైన అన్ని టాయిలెట్లతో బాత్రూమ్లు జోడించబడ్డాయి.
బోటింగ్ కూడా ఆనందించవచ్చు...
ఈ హోటల్లో బోట్ రైడ్లను కూడా ఆస్వాదించవచ్చు. తాజ్ లేక్ ప్యాలెస్ హోటల్ వాస్తవానికి ఉదయపూర్ వాటర్ ప్యాలెస్, దీనిని 18వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని పాలరాయితో నిర్మించారు. పడవ సహాయంతో ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా అందమైన దృశ్యాలతో చుట్టుముట్టబడిన పిచోలా సరస్సుపై నిర్మించబడింది. పిచోలా సరస్సు ఒక కృత్రిమ సరస్సు. దీనిని 1362లో బంజారా తెగకు చెందిన పిచ్చు బంజారా నిర్మించారు.



Click it and Unblock the Notifications












