మహాశివరాత్రికి సందర్శించాల్సిన ప్రముఖ ఆలయాలు
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18న నిర్వహించనున్నారు. ఈ రోజున అందరూ ఆ మహాశివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మీరు కూడా ఆ రోజున శివుడిని దర్శించుకోవాలనుకుంటే, దేశంలోనే పేరుగాంచిన ఈ ఆలయాలను సందర్శించవచ్చు.
దేవతల దేవుడైన మహాశివుడిని చాలా మంది ప్రజలు ఆరాధిస్తారు. మహాశివరాత్రి పండుగను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ రోజున దేశవ్యాప్తంగా భక్తుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేకమైన రోజున భోళా శంకరుని భక్తులు భక్తిలో మునిగిపోతారు. ప్రజలు ఈ రోజున శివుడిని పూజించడమే కాకుండా, ఉపవాసం కూడా ఉంటారు. ఇది కాకుండా, శివ దర్శనం కోసం చాలా మంది ఆలయాన్ని సందర్శిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక శివాలయాలు ఉన్నాయి.

మహాకాల్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని
పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాల్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. దేశంలోని జ్యోతిర్లింగాలలో శివరాత్రి పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపే ఆలయాల్లో ఈ ఆలయం మాత్రమే ఉంది. ఈ సమయంలో, నీలకంఠుడు తన భక్తులకు తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తాడు. శివరాత్రి రోజున, భోళా శంకరుని రూపం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది. ఈ రోజున, శివుని దర్శనం కోసం ఉజ్జయిని మహాకాల్ ఆలయానికి దేశంలోనే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు చేరుకుంటారు.

కాశీ విశ్వనాథ దేవాలయం, బనారస్
శివరాత్రి సందర్భంగా మీరు ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం బనారస్లో ఉన్న కాశీ విశ్వనాథుడిని సందర్శించవచ్చు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయం గంగా నది ఒడ్డున ఉంది. ఈ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీనితో పాటు, ఈ ప్రదేశం శివుని అర్ధాంగి పార్వతికి ఇష్టమైన ప్రదేశంగా కూడా పరిగణించబడుతోంది. ఆలయ నిర్మాణశైలి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఓంకారేశ్వర ఆలయం, శివపురి
శివరాత్రి రోజు దర్శనం కోసం భక్తులు మధ్యప్రదేశ్ శివపురిలోని ఓంకారేశ్వర్ ఆలయానికి కూడా చేరుకుంటారు. మీరు కూడా శివరాత్రి సందర్భంగా శివుడిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటే, ఓంకారేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ సందర్భంలో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇండోర్ విమానాశ్రయం ఇక్కడికి చేరుకోవడానికి వాహన సౌకర్యం ఉంది.

సోమనాథ్ ఆలయం, కతియావార్
12 జ్యోతిర్లింగాలలో గుజరాత్లోని సోమనాథ్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. త్రివేణి సంగమం వద్ద ఉన్న ఈ ఆలయం గుజరాత్లోని కతియావార్ ప్రాంతంలోని సముద్ర తీరంలో ఉంది. ఇక్కడి తీరప్రాంతపు అలల సవ్వడి ఆలయ అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఆక్రమణదారులు మరియు పాలకులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ప్రతిసారీ ఇది పునర్నిర్మించబడింది. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పురష్కరించుకుని ఇక్కడికి భక్తులు చేరుకుంటారు.



Click it and Unblock the Notifications













