ఈశాన్య భారతదేశపు అతిపెద్ద నగరాలలో ఒకటి అస్సాం. ఈ రాష్ట్రానికి చెందిన గౌహతి బ్రహ్మపుత్రా నది ఒడ్డున వెలసింది. ఇక్కడ పర్యాటకులు సందర్శించేందుకు అనువవైన ప్రదేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల రవాణా వసతులు కలిగిన పట్టణం ఇది. ఈశాన్య రాష్ట్రాలకి ఒక 'ద్వారం' లాంటిదని అస్సాం అని చెప్పొచ్చు.
అస్సాం రాజధాని గౌహతిలో ఉన్న కామాఖ్య ఆలయంలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అంబుబాచి ఫెయిర్ నిర్వహిస్తారు. ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. అంతేకాదు, తంత్ర సాధనకు ఈ ఆలయం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో అమ్మవారి యోనిని పూజిస్తారు. అంబుబాచి జాతర సమయంలో, దేవత రుతుస్రావం అవుతుందని ఇక్కడివారి నమ్మకం. అందుకే, ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలోకి పురుషుల ప్రవేశం ఉండదు. ఆ మూడు రోజులు ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఇక్కడివారి విశ్వాసం ప్రకారం ఆ మూడు రోజులు దేవత ముందు తెల్లటి వస్త్రాన్ని ఉంచుతారు. ఆ మూడురోజుల తర్వాత ఆలయ తలుపులు తెరిచినప్పుడు, వస్త్రం ఎరుపు రంగుతో తడిగా ఉంటుంది. ఆ వస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.

అంబుబాచి జాతర ఎప్పుడు?
ఇక, ఈ ఏడాది అంబుబాచి ఫెయిర్ జూన్ 22 నుండి ప్రారంభమవుతుంది. జూన్ 25, 2024 వరకు కొనసాగుతుంది. జూన్ 25వ తేదీ రాత్రి 9.08 గంటలకు కామాఖ్య ఆలయ తలుపులు భక్తుల సందర్శనార్థం తిరిగి తెరవబడతాయి. ఈ సమయంలో, సాంప్రదాయ ఆచారాల ప్రకారం నిర్వహించే ఆచారాలలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వస్తుంటారు.
రుతుస్రావం అయిన మూడు రోజుల తర్వాత కామాఖ్య దేవాలయం తలుపులు తిరిగి తెరుచుకుంటాయి. అది శుభప్రదమైన సంఘటనగా పరిగణించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ ప్రాంగణానికి తరలివస్తున్నారు. ఆలయ తలుపులు తెరిచాక అంగోదక్ (పవిత్ర జలం), అంగవస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

VIP పాస్ జారీ రద్దు..
ఇక, ఈ ఏడాది అమ్మవారి దర్శనం కోసం వెళ్లేవారికి VIP పాస్ జారీ చేయబడదు. అంబుబాచి సమయంలో అమ్మవారి దర్శనం కోసం ఎవరైనా వీఐపీ ఆలయానికి చేరుకున్నట్లయితే, సాధారణ భక్తుల మాదిరిగానే వారు కూడా అమ్మవారి దర్శనం కోసం క్యూలో నిలబడాల్సి ఉంటుంది. కామాఖ్య ఆలయానికి వెళ్లే రహదారి రాత్రి 8 గంటలకు మూసివేస్తారు. పాండుఘాట్ నుంచి వచ్చే రోడ్డు కూడా రాత్రిపూట మూసి ఉంటుంది. బోట్ వాహన సేవ కూడా మూసివేయబడింది. జాతర సమయంలో, పాండు నుండి కామాఖ్య ఆలయ మార్గంలో మాత్రమే పడవ సేవ అందుబాటులో ఉంటుంది.

ఆహారం మరియు సాధారణ రోజుల్లో, కామాఖ్య ఆలయం ఉదయం 7.30 గంటలకు తెరిచి సాయంత్రం 5 గంటలకు మూసివేయబడుతుంది. ఆలయాన్ని మధ్యాహ్నం 1 నుండి 2.30 గంటల మధ్య మూసివేస్తారు. అయితే జాతర సమయంలో ఆలయ తలుపులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ప్రవేశం ఉచితం. అంబుబాచి మేళా అనేది కేవలం దేవత ఆరాధన మాత్రమే కాదు. స్త్రీలను గౌరవించే, ఆరాధించి జరుపుకునే పండుగ. ఈ పూజలో పాల్గొనడానికి వచ్చిన భక్తులు ఈ కామాఖ్య దేవిని పూర్తి భక్తి, గౌరవంతో పూజిస్తారు.



Click it and Unblock the Notifications













