వివాహం మానవ జీవితంలో మరుపురాని ఘట్టం. ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పెద్దలు ఎన్నో జాగ్రత్తలు, ముహుర్తాలు చూసి నిర్వహించే ఒక పవిత్రకార్యం. అయితే కొన్ని సార్లు ఆ వివాహ బంధం ఆ నవ దంపతుల జీవితాల్లో అల్లకల్లోలాన్ని చెలరేగిస్తుంది. అందువల్లే ఆ వివాహం సరైన చోటు నిర్వహిస్తే అటువంటి సమస్యలు రావని భావిస్తూ ఉంటారు. అటువంటి కోవకు చెందిన ఓ దేవాలయం కేరళలో ఉంది. ఈ దేవాలయంలో ఏటా జరిగే పెళ్లిళ్ల సంఖ్య భారత దేశంలో మరే ఇతర దేవాలయంలో కూడా జరగవని చెబుతారు. ఇందుకు గల కారణాలతో పాటు ఆ క్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం
ఇక్కడికి వెళితే మీ తలరాత మారిపోవడం ఖచ్చితం
యోని స్రావిత జలన్ని తీర్థంగా సేవించే పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలుసా..
ఆ ఊరంతా చేతబడి చేసేవాళ్ళే - క్షుద్రమాంత్రికులు మటుకే ఉండే ఊరు !
గురువాయూరు, కేరళ
P.C: You Tube
గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని ప్రముఖ పట్టణం. దక్షిణ ద్వారకగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీ కృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో పూజింపబడుతున్నాడు.
యుగాంతం ముందుగా తెలిపే బసవన్న వెలిసిన క్షేత్రం చూశారా?
నాలుగు చేతులు
P.C: You Tube
నాలుగు చేతులతో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి తులసి మాలలతో ముగ్ధ మనోహర రూపంతో బాలగోపాలుడి రూపంలో మనకు ఈ గురువాయూర్ దేవాలయంలో కనిపిస్తాడు.
కొత్త దంపతులు ఆ కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటా
త్రిసూర్ కు 30 కిలోమీటర్లు
P.C: You Tube
కేరళలోని త్రిసూర్ కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఆ నల్లనయ్యను సామిని కన్నన్, ఉన్ని కృష్ణన్ అంటే బాలకృష్ణుడు, ఉన్ని కన్నన్,గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు.
మరో పదమూడు రోజుల్లో సూర్యకిరణాలు తాకే ఈ విగ్రహాన్ని చూస్తే మోక్షం ఖచ్చితం
వాయువు, గురువు
P.C: You Tube
ఇక్కడ మూలవిరాట్టు ప్రతిష్టాపనకు గురువు, వాయువు ప్రధాన కారణం కాబట్టి ఈ ప్రాంతాన్ని వారిద్దరి పేర్లను కలిపి గురువాయూరు పేర్లతో పిలవడం మొదలుపెట్టారు.
ఐదువేల ఏళ్ల నాటిది
P.C: You Tube
ఇక ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్టించబడం వెనుక ఉన్న పురాణ కథనం ప్రకారం. ఇక్కడి గర్భగుడిలోని విగ్రహం ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదని చెబుతారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా చూపుతారు.
త్రిమూర్తులు
P.C: You Tube
ఈ విగ్రహాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ పూజించారని చెబుతారు. ఈ విగ్రహం అత్యంత అరుదైన పాతాళ శిలతో తయారయ్యిందని చెబుతారు. ఇటువంటి శిలతో తయారైన విగ్రహం ఇదొక్కటే.
శివుడు బ్రహ్మకు ఇచ్చాడు
P.C: You Tube
ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడని ఆయన దానిని సంతానం కోసం పరితపిస్తున్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ చెబుతారు. ఆయన దానిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తాడు.
వసుదేవుడి నుంచి శ్రీ కృష్ణుడు
P.C: You Tube
అటు పై ఆతడి నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ చెబుతాడు.అటు పై వసుదేవుడి నుంచి శ్రీ కృష్ణుడు అందుకొని ద్వారకలో ప్రతిష్టించాడనీ చెబుతారు.
స్వర్గారోహణ సమయంలో
P.C: You Tube
స్వర్గారోహణ సమయంలో శ్రీ కృష్ణుడు తన శిష్యుడైన ఉద్దవుడిని పిలిచి త్వరలో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతూ ఉంటుందని చెబుతాడు.
కేరళ తీరానికి
P.C: You Tube
ఆ విగ్రహాన్ని తీసుకుని దేవతల గురువైన బృహస్పతికి అదజేయమని చెప్పాడని పురాణాలు చెబుతాయి. అటు పై ఉద్దవుని సందేశం ప్రాకారం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వస్తాడు.
శివుడు తపస్సు చేస్తూ
P.C: You Tube
అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించగా ఆయన ఆదేశాలను అనుసరించి వారిరువురూ ఇక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక పరమేశ్వరుడు తపస్సు చేసిన కోరును రుద్ర తీర్థంగా పిలుస్తారు.
పార్వతిని తీసుకొని
P.C: You Tube
అటు పై శివుడు పార్వతిని తీసుకుని అక్కడి నుంచి సరస్సు అవతలి ఒడ్డున కొలువై ఉంటాడు. ఆ ప్రాంతాన్నే ప్రస్తుతం మామ్మియూర్ అని పిలుస్తారు. ఇక గురువాయూరులోని ఆలయాన్ని మొదట విశ్వకర్మ నిర్మించగా అటు పై ప్యాండ్యురాజులు పున:నిర్మించారని చెబుతారు.
అన్నప్రాశన
P.C: You Tube
గురువాయూరప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం.
వివాహం చేసుకొంటే
P.C: You Tube
అదే విధంగా గురువాయూరప్ప సమక్షంలో పెళ్లి చేసుకొంటే జీవితం ఆనందమయంగా ఉంటుందని చెబుతారు. అందుకే సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడుతారు.
తులాభారం
P.C: You Tube
అందువల్లే కేరళలో మరే గుడిలో జరగని పెళ్లిళ్లు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపళ్లు, బెల్లం, కొబ్బరికాయలు తదితరాలను స్వామివారికి భక్తులు నివేదిస్తారు.
గజరాజులు
P.C: You Tube
గజరాజుల ప్రస్తావన లేని గురువాయూరును ఊహించలేము. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్ ల గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. పద్మనాభన్ ఎంతో సాధు లక్షణాలతో ఉండేది.
పద్మనాభన్
P.C: You Tube
ఈ పద్మనాభన్ జీవించి ఉన్నంతవరకూ స్వామిసేవలోనే గడిపింది. క్రీస్తుశకం 1931లో అది చనిపోయే సమయంలో స్వామి నుదుట ఉన్న గంధం బొట్టు రాలిపోయిందట.
ఏకాదశి రోజున
P.C: You Tube
అటు పై పద్మనాభన్ వారసత్వాన్ని కేశవన్ అందిపుచ్చుకొంది. అచ్చం పద్మనాభన్ వలే స్వామిని సేవించేది. క్రీస్తుశకం 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించింది.
ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో
P.C: You Tube
ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్ కోటలో దేవస్థానానికి చెందిన ఏనుగుల శాల ఉంది. ఇందులో సుమారు 60 ఏనుగులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు.
కేశవన్ విగ్రహం కూడా
P.C: You Tube
ఇక్కడ కేశవన్ విగ్రహం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగులకు వివిధ రకాల పందేలు పెడుతారు. వీటిని చూడటానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు.