భారతదేశంలోని ఈ శివాలయాలను సందర్శించారా?
భారతదేశం ఆధ్యాత్మిక ప్రదేశాలకు నెలవు. ఇక్కడ ఎక్కడా చూసినా మనకు పుణ్యక్షేత్రాలు తారసపడుతూనే ఉంటాయి. ప్రత్యేకంగా పండుగల సమయంలో అయితే ఇక్కడి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఇక మహిళలకు ఎంతగానో ఇష్టమైన శ్రావణమాసం వంటి పవిత్రమాసాల రోజుల్లో అయితే ఇక దేవాలయాల గురించి చెప్పక్కర్లేదు. ఆ సమయంలో ప్రత్యేకంగా శివరాధానలు చేస్తుంటారు. ఈ పవిత్రమాసం ప్రతిఏటా వర్షాకాల ఆరంభంలో ప్రారంభమవుతుంది. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో శివున్ని ఆరాధిస్తారు. భోలేనాథున్ని ప్రసన్నం చేసుకునేందుకు చాలామంది పూజలు, ఉపవాసాలు కూడా చేస్తుంటారు. మరికొందరు ఈ సమయంలో ఆ మహాశివుని చెంతకు చేరాలని ప్రయాణాలు సిద్ధంచేసుకుంటుంటారు. అటువంటి వారు తప్పకుండా తప్పకుండా దీన్ని చదవండి. ఎందుకంటే, భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన శివాలయాల గురించి ఇప్పడు మనం తెలుసుకుందాం.

సోమనాథ్ ఆలయం
గుజరాత్లో ఉన్న సోమనాథ్ శివాలయం దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయానికి తనదైన గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం భోలేనాధుని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ శివుడు కొలువై ఉంటాడని ఇక్కడికి వచ్చే భక్తులు విశ్వసిస్తారు. నిర్మించినప్పటి నుండి ఇప్పటివరకు సుమారు ఏడు సార్లు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. చివరిసారిగా వల్లభాయ్ పటేల్ 1951 లో పునర్నిర్మించారు. ఈ ఆలయం లోపల విశాలమైన మంటపం, ఎత్తైన గుండ్రటి గోపురం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. గర్భగుడి లోని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. శివలింగం వెనకాల పార్వతి దేవి విగ్రహం కనిపిస్తుంది.

మహాకాళేశ్వర దేవాలయం
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకలేశ్వర ఆలయం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి మహాశివున్ని దర్శించుకుంటారు. ప్రత్యేకించి శ్రావణ మాసంలో ఇక్కడ జనసందోహం అధికంగా కనిపిస్తుంది. ఇక్కడ బాబా మహాకాల్ సవారీ శ్రావణమాసం సమయంలో బయటకు తీయబడుతుంది. ఉజ్జయిని మహాకాల్ ఆలయం కాలక్రమేణా అనేక దాడులకు గురవ్వడమేకాకుండా ధ్వంసం చేయబడింది. అయినప్పటికీ, సింధియా వంశం 19వ శతాబ్దంలో దాని పునరుద్ధరణ బాధ్యతను స్వీకరించింది.
శ్రీ బృహదీశ్వర ఆలయం
తమిళనాడులోని తంజోర్లో ఉన్న ఈ దేవాలయం పురాతనమైన, అతిపెద్ద భగవంతుని ఆలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళుడు I నిర్మించాడని ఇక్కడి వారు నమ్ముతారు. శ్రావణ మాసంలో శివాలయాన్ని సందర్శించాలని ఆలోచిస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శరించాల్సిందే. ఈ ఆలయాన్ని భక్త పెరియ కోవిల్, రాజరాజేశ్వర మరియు రాజరాజేశ్వరం అని కూడా పిలుస్తారు.

బైద్యనాథ్ ఆలయం
జార్ఖండ్లోని డియోఘర్లోని బైద్యనాథ్ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. పురాతన శివాలయాల జాబితాలో ఈ ఆలయం పేరు కూడా పరిగణించబడింది. శ్రావణమాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం పురాణాలు మరియు నిర్మాణ శైలికి కూడా ప్రసిద్ధి చెందింది.
భోజ్పూర్ ఆలయం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుండి కొంత దూరంలో ఉన్న భోజ్పూర్ దేవాలయం కూడా శివుని ప్రసిద్ధ మరియు పురాతన దేవాలయాలలో ఒకటి. పురాతన కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో ఉన్న శివలింగం అతిపెద్ద శివలింగ హోదాను పొందింది. ఈ ఆలయాన్ని ఒక్క రాత్రిలో నిర్మించారని ఇక్కడి వారు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications












