ఇండియాలో జంట నగరాలు అనేకం కలవు. ఎంతో పెద్ద హైదరాబాద్ - సికింద్రాబాద్ నగరాల నుండి సాంగ్లి - మీరాజ్ వంటి చిన్న నగరాల వరకూ ఈ నగరాలు జంటలు గా వ్యవహరిస్తున్నాయి. ఈ నగరాలు, టవున్ లు ఎపుడు చెప్పినా కలిపే చెపుతారు. ఈ పట్టణాల పాలన కూడా స్వతంత్రంగానే వుంటుంది. కాని ఒకదానితో మరి ఒకటి అనుబంధం కలిగి వుంటాయి. ఇండియా లోని అటువంటి ప్రసిద్ధ జంట నగరాల జాబితా పరిశీలిద్దాం.

జంట నగరాల వింత గోల ?
ఒకదాని పక్కనే ఒకటి గల ఈ నగరాలు రెండూ ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఎవరు ఎపుడు ఒకటి చెప్పినా, రెండవ దాని గురించి కూడా చెపుతారు. ఈ నగరాలు రెండూ విభిన్న చరిత్రలు, సంస్కృతి కలిగి వున్నాయి. అయినప్పటికీ ఒకదానితో మరి ఒకటి ముడి పది వుంటాయి. ఈ రెండు నగరాలను భౌగోళికంగా మధ్యలో కల హుస్సేన్ సాగర్ అనే సరస్సు విడ దీస్తుంది.
Nagesh Jayaraman

జంట నగరాల వింత గోల ?
ధార్వాడ్ పట్టణం హుబ్లీ కి ఆగ్నేయంగా 20 కి. మీ. ల దూరంలో కలదు. ఈ రెండు నగరాలు, కర్నాటక రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు. ఒకదాని పేరు చెపితే చాలు, మరి ఒక పేరు వెంటనే నోటికి రావలసినదే.
GuruAngadi

జంట నగరాల వింత గోల ?
కోచి మరియు ఎర్నాకులం పట్టణాలు రెండూ కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లా లో కలవు. రెండు నగరాలు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. పర్యటనా రంగంలో సైతం ఈ రెండు నగరాల గురించి తెలియని వారుండరు.
Sanif

జంట నగరాల వింత గోల ?
గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ - అహ్మదాబాద్ నగరాలు ఒకదానికొకటి 26 కి. మీ. ల దూరంలో వుంటాయి. ఎంతో చరిత్ర కల నగరాలు. ఈ రెండు నగరాలు పర్యటనా రంగంలో ప్రసిద్ధిచెందినవే.
Gaurav Raval

జంట నగరాల వింత గోల ?
భువనేశ్వర్ పట్టణం ఓడిషా రాష్ట్రానికి ప్రస్తుతం రాజధాని. కటక్ ఓడిషా కు పూర్వపు రాజధాని. ఈ రెండూ కూడా ఒకదానికొకటి 26 కి. మీ.ల దూరంలో 60 డిగ్రీల కోణంగా ఉనాయి. కటక్ పట్టణాన్ని సిల్వర్ సిటీ అని పిలువగా, భువనేశ్వర్ పట్టణాన్ని టెంపుల్ సిటీ గా అభివర్ణిస్తారు. భువనేశ్వర్ నగరం ఆధునిక ఇండియా లోని మొట్ట మొదటి ప్రణాలికా బద్ధ నగరంగా పేర్కొంటారు.
Daniel Limma



Click it and Unblock the Notifications











