మనం చాలామంది దేవుళ్ళకి కొంతమంది పళ్ళు, కొంతమంది కాయలు, ఇంకొంతమంది స్వీట్స్, తినుబండారాలు ఇలా చాలామంది వాళ్ళ యొక్క ప్రాంతాల్లో, వాళ్ళ యొక్క పద్ధతుల్లో దేవుడికి నైవేద్యంగా చాలామంది ప్రసాదంగా సమర్పిస్తూ వుంటారు.
పురాణ కథల్లో శ్రీకాళహస్తిలో భక్తకన్నప్ప అనే మహాభక్తుడు శివుడికి ఆ రోజుల్లో అడవిలో దొరికే జంతువు యొక్క మాంసాన్ని ప్రసాదంగా సమర్పించేవాడంట. దాని గురించి వింటేనే మనకు అదోలా వుంటుంది. దేవుడికేంటి?మాంసం సమర్పించటం ఏంటని?
టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
భక్తుడైన భక్త కన్నప్ప
కానీ దేవునికి భక్తితో సమర్పించేది ఏదైనా ప్రసాదంగా ఇవ్వొచ్చంట.కానీ ఆ రోజుల్లో అంత భక్తుడైన భక్త కన్నప్ప యొక్క మాంసాన్ని ప్రసాదంగా సమర్పించాడని వింటే మనం ఎంతో ఆశ్చర్యానికి గురవుతాం.
PC:youtube
సంగమేశ్వర ఆలయం
ఈ రోజుల్లో కూడా విజయనగరం జిల్లా కొమరాడు మండలం గుంప సంగమేశ్వర ఆలయంలో ఆ వూరి ప్రజలు శివరాత్రిరోజున జాతర నిర్వహిస్తారు.
PC:youtube
నైవేద్యం
శివరాత్రిరోజున జాతర నిర్వహించటం మామూలే. కానీ ఇక్కడ గుంప సంగమేశ్వర ఆలయంలో కొలువైన ఈశ్వరుడిని మాత్రం అక్కడ చేపల్ని కూరగా వండి నైవేద్యంగా ప్రసాదంగా సమర్పిస్తారంట.
PC:youtube
గుంప సంగమేశ్వర స్వామి దేవాలయం
ఇది విశేషం. ఆ వూరిలో గుంప సంగమేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.
PC:youtube
శివరాత్రి ఉత్సవాలు
ఆ దేవాలయంలో శివునికి ప్రతీ సంవత్సరం నిష్టగా మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరుపుతారు.
PC:youtube
నైవేద్యం
అక్కడ ప్రసాదంగా రకరకాల పండ్లు, పువ్వులు ప్రసాదాలతో పాటు చేపలకూర కమ్మగా వండి శివునికి నైవేద్యంగా పెడతారంట.
PC:youtube
చేపలకూర నైవేద్యం
ఈ ఆచారం ఇప్పటిది కాదంట. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఈ విధంగానే ఈ పద్ధతిని పాటిస్తున్నారంట.
PC:youtube
చేపలకూర
ఈ విధంగా చేపల్ని కూరగా వుండి శివునికి ప్రసాదంగా సమర్పించటం వల్ల వారికి చాలామందికి వారు కోరుకునే కోరికలు నెరవేరాయని అక్కడ ప్రజలు చాలామంది ఇప్పటికీ చెపుతూనే వున్నారు.
PC:youtube
పూర్వీకులు
కొన్ని దశాబ్దాలుగా ఆ వూరి ప్రజలు తమ పూర్వీకుల నుండి వస్తున్నా ఈ ఆచారాన్ని ఇప్పటికి కూడా తూ.చ తప్పకుండా పాటిస్తునే వున్నారంట.
PC:youtube
- వచ్చే పదేళ్లలో కాకినాడ, భీమవరం, పాలకొల్లు సముద్రంలో మునిగిపోతాయా ?
- గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
- గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !