Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవే..!

భారతదేశంలోని పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవే..!

భారతదేశంలోని పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవే..!

పర్యాటక రంగంలో భారతీయ రైల్వేల సహకారం చాలా ముఖ్యమైనది. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లాలన్నా, గమ్యాన్ని చేర్చాల‌న్నా.. అందరి అవసరాలను తీర్చాల‌న్నా.. ఈ రవాణా స‌దుపాయ‌మే ముందుగా ఉపయోగపడుతుంది. దేశంలోని రైల్వే స్టేషన్ల గురించి చెప్పాలంటే, భారతదేశంలో మొత్తం 7500 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రైల్వేలలో పరిశుభ్రత గురించి మాట్లాడినట్లయితే, దేశంలో ఇలాంటి రైల్వే స్టేషన్లు చాలానే ఉన్నాయి. ఇక్కడి రైల్వే స్టేషన్‌ను శుభ్రతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. దేశంలోని క్లీన్ రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

1

జోధ్‌పూర్ రైల్వే స్టేషన్

బ్లూ సిటీ అని పిలువబడే జోధ్‌పూర్ రాజస్థాన్‌లోని అత్యంత అందమైన నగరాల్లో ఒకటిగా పరిగణించబడింది. ఈ నగరంలో మెహ్రాన్‌ఘర్ కోట, ఉమైద్ భవన్ ప్యాలెస్, ఖేజ్డ్లా ఫోర్ట్, రావు జోధా ఎడారి రాక్ పార్క్ వంటి అనేక అందమైన, ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్క‌డి రైల్వే స్టేషన్ గురించి చెప్పాలంటే, ఈ స్టేషన్ చాలా శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిచోటా శుభ్రతను చూస్తారు. ఇక్కడ ఐదు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. అవి చాలా శుభ్రంగా ఉంటాయి.

2

జమ్ము తావి రైల్వే స్టేషన్

జమ్మూ తావి రైల్వే స్టేషన్‌ను జమ్మూ వ్యాలీ యొక్క గేట్‌వే అని కూడా పిలుస్తారు. ప్రయాణికులు జమ్మూ నుండి ప్రవేశించి, జమ్మూ లోయలోని అందమైన ప్రదేశాలలో నడక సాగిస్తారు. జమ్మూ చుట్టూ ప్రకృతి ఎంత అందంగా ఉందో, ఈ రైల్వే స్టేషన్ అంత శుభ్రంగా ఉంటుంది. ఎప్పుడూ ప్రయాణికుల రద్దీతో ఉండే ఈ స్టేషన్ జమ్మూలో అతిపెద్ద రైల్వే స్టేషన్. ప్రజలు జమ్మూకి రావడానికి లేదా వైష్ణో దేవికి వెళ్లడానికి ఈ స్టేషన్‌ని ఎంచుకుంటారు.

3

విజయవాడ రైల్వే స్టేషన్

విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక మతపరమైన, చారిత్రక నగరం. ఇక్కడికి వెళ్లేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి విజయవాడ అందాలను తిల‌కిస్తున్నారు. మరోవైపు, ఇక్కడ రైల్వే స్టేషన్ల గురించి చెప్పాలంటే, ఇక్కడి రైల్వే స్టేషన్ కూడా క్లీన్ రైల్వేస్టేష‌న్ల జాబితాలో చేరిపోయాయి.

హరిద్వార్ రైల్వే స్టేషన్

ఉత్తరాఖండ్ మైదానంలో ఉన్న హరిద్వార్ భారతదేశంలోని అతిపెద్ద మతపరమైన ప్రదేశాలలో ఒక‌టిగా నిలిచింది. కుంభమేళా జరిగిన ప్రదేశం ఇదే. ఇక్కడ సందర్శించడానికి - హర్ కి పౌరి, బ్రహ్మ కుండ్, మానసా దేవి ఆలయం, చండీ దేవి ఆలయం, భారత్ మాతా ఆలయం, చిల్లా వైల్డ్ లైఫ్ సెంచరీ వంటి ప్ర‌దేశాలున్నాయి. భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్‌లో హరిద్వార్ రైల్వే స్టేషన్ కూడా ఒక‌టి.

దుర్గాపూర్ రైల్వే స్టేషన్

జైపూర్ రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గాపూర్ రైల్వే స్టేషన్ గత సంవత్సరం స్వచ్ఛ భారత్ సర్వేలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ రైల్వే స్టేషన్ రాజస్థాన్‌లోని వాయువ్య రైల్వే నెట్‌వర్క్‌లో ఉంది. రాజస్థాన్‌లో ఏడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి ఏడాది పొడవునా శుభ్రంగా ఉంటాయి.

రాణి కమలపాటి రైల్వే స్టేషన్

దేశంలోని పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ పేరు కూడా ఉంది. ఈ స్టేషన్లు పరిశుభ్రతలో మాత్రమే కాకుండా, దాని అందం కారణంగా, విమానాశ్రయంతో పోల్చబడ్డాయి. అంతే కాదు ఇక్కడి సౌకర్యాల వల్ల ఇక్కడికి వచ్చే ప‌ర్యాట‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తున్నాయి.

More News

Read more about: jodhpur railway station
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+