భారతదేశంలో శీతాకాలంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అలాంటి ప్రదేశం రాజస్థాన్. జైపూర్ నుండి జోధ్పూర్, జైసల్మేర్ నుండి ఉదయపూర్ వరకు అనేక గమ్యస్థానాలు ఉన్నాయి. ఈ సీజన్లో జైపూర్ను సందర్శించడం ఎంతో ఉత్తమం. ఇక్కడ సందర్శనకు ప్రదేశాలకు కొరతే లేదు.ఇక్కడ యాత్ర అసంపూర్తిగా ఉంటుంది. ఇది అమెర్ కోట. దీనిని అంబర్ ఫోర్ట్ లేదా అమెర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. అమెర్ రాజస్థాన్లో ఉన్న ఒక అందమైన నగరం.
దాని పేరు మీదుగా ఈ కోటకు పేరు పెట్టారు. ఇది రాజా మాన్ సింగ్ చేత నిర్మించబడింది. 1592 సంవత్సరంలో దీని నిర్మాణం పూర్తయింది. ఈ కోట కొండపై సుమారు 1.5 చదరపు మైళ్లలో విస్తరించి ఉంటుంది. ఇక్కడ నుండి పర్యాటకులు అమెర్ నగరం యొక్క అద్భుతమైన దృశ్యాలను తిలకించవచ్చు. ఈ ప్రదేశాలను సందర్శించేందుకు మార్చి వరకు ఎప్పుడైనా వెళ్లొచ్చు. జైపూర్ వెళుతున్నట్లయితే, ఇక్కడ అమెర్ కోటను చూడడం అస్సలు మిస్సవ్వద్దు.

అమెర్ కోట చరిత్ర..
అమెర్ కోట జైఘర్ కోటకు సరిగ్గా సమాంతరంగా ఉంటుంది. ఈ రెండు కోటలు క్రింద ఉన్న కాజ్ వే ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. శత్రువుల నుండి కోటను రక్షించడం దీని నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అమెర్ కోట యొక్క మొదటి నిర్మాణాన్ని 11వ శతాబ్దంలో రాజా కాకిల్ దేవ్ ప్రారంభించాడు. అయితే తరువాత దీనిని రాజా మాన్ సింగ్ 1592లో పూర్తి చేశాడు. అమెర్ కోట మధ్యయుగ కాలం నాటి స్మారక చిహ్నం. ఈ కోట శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న అమెర్ కోట గొప్పది మాత్రమే కాదు ఎంతో అందమైనది కూడా. ఈ కోటను నిర్మించడానికి ఎర్రని పాలరాతి రాళ్లను ఉపయోగించారు.
మాన్సింగ్ మహల్
ఇది అమెర్ కోటలోని పురాతన ప్యాలెస్. దీనిని రాజా మాన్సింగ్ నిర్మించారు.
శీష్ మహల్
ఈ కోటలో అత్యంత ప్రసిద్ధిచెందింది శీష్ మహల్ దీనిని చూడగానే గుర్తుండిపోతుంది. ఇది అద్దాలతో చుట్టుముట్టబడిన గది. దీనిలో కాంతి కిరణం మొత్తం నడుముని ప్రకాశిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ చిత్రం మొఘల్-ఏ-ఆజంలోని ప్యార్ కియాతో డర్నా క్యా అనే పాటను ఈ ప్యాలెస్లోనే చిత్రీకరించడం జరిగింది. అమెర్ కోటలోని దివాన్-ఎ-ఆమ్- అమెర్ కోటలోకి ప్రవేశించగానే, నలభై పాలరాతి స్తంభాలతో చేసిన చాలా పెద్ద దీర్ఘచతురస్రాకార భవనం ఉంది. ఇక్కడ రాజుగారి ఆస్థానం జరిగేదని చెబుతుంటారు. ఈ భవనాన్ని రాజా జై సింగ్ నిర్మించారు.

సుహాగ్ ఆలయం
అమెర్ కోట పై అంతస్తులో చాలా పెద్ద కిటికీలు ఉంటాయి. దీనిని "సుహాగ్ మందిర్" అని కూడా పిలుస్తారు. ఈ కిటికీల నుండి, రాణులు, మహిళలు రాచరికం, ఇతర కార్యక్రమాలను చూసేవారు. రాజస్థాన్లోని ఈ కోటలో బాలీవుడ్ సినిమా చిత్రీకరణలు మాత్రమే కాదు. అనేక హాలీవుడ్ చిత్రాలను కూడా చిత్రీకరించడం జరిగింది. ఇందులో బాజీరావ్ మస్తానీ, శుద్ధ్ దేశీ రొమాన్స్, మొఘల్-ఎ-ఆజం, భూల్ భులయ్యా, జోధా అక్బర్ వంటి చిత్రాలు ఉన్నాయి. ప్రతిరోజూ సాయంత్రం కోటలో లైట్ అండ్ సౌండ్ షో కూడా నిర్వహిస్తారు. ఇది చూడటానికి నిజంగా అద్భుతంగా ఉంటుంది. అయితే దీని కోసం ప్రత్యేక టిక్కెట్ను కొనుగోలు చేసుకోవచ్చు.
సందర్శించడానికి ఉత్తమ సమయం
అక్టోబరు నుండి మార్చి నెలల వరకు ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం. చాలా ప్రదేశాలలో ఈ సమయంలో చల్లగా ఉన్నప్పటికీ, ఇక్కడి వాతావరణం ప్రయాణానికి ఎంతో అనుకూలమైనదని చెప్పుకోవచ్చు.
ఎలా చేరుకోవాలి?
ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి నగరాల నుండి జైపూర్కు నేరుగా డీలక్స్, రాష్ట్ర రవాణా బస్సులను పొందుతారు. అమెర్ ఫోర్ట్ జైపూర్ నగరం నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి జైపూర్ నుండి ఇక్కడకు చేరుకోవడానికి టాక్సీని బుక్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications












