Search
  • Follow NativePlanet
Share
» »ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌కు.. యానాంలోని ఈ ప్ర‌దేశాలు నిల‌యాలు..

ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌కు.. యానాంలోని ఈ ప్ర‌దేశాలు నిల‌యాలు..

కొత్త ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించ‌డం ద్వారా విశ్రాంతి ల‌భిస్తుంది. నిత్యం జ‌రిగే కార్య‌క్ర‌మాల నుండి ఇది కొంత ఉప‌శ‌మనాన్ని క‌లిగిస్తుంది. నవంబ‌ర్ నుండి జ‌న‌వ‌రి మ‌ధ్య‌లో సంద‌ర్శించే ప్ర‌దేశాల‌లో యానాం ఒక‌టి. ఇక్క‌డి ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం, ప్ర‌కృతి అందాల దృశ్యాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. యానాం, అనేక పర్యాటక ప్రదేశాలకు నిలయం. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం తరచుగా ఫ్రెంచ్ కాలనీ పాండిచ్చేరితో పోల్చబడుతుంది. కోనసీమ కేంద్రమైన అమలాపురం నుంచి కాకినాడ వెళ్లే మార్గ మధ్యలో ఈ ప్ర‌దేశం ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని ఫ్రెంచి యానాం అని కూడా అప్ప‌ట్లో పిలిచేవారు. అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో యానాం ఒకటి.

draksharamam temple

ద్రాక్షారామం

ద్రాక్షారామం హిందువుల ఆరాధ్యదైవం శివుడు గౌరవించే ఐదు పంచారామ క్షేత్రాలలో ఒకటి. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం యానాం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. చోళ, చాళుక్యుల శైలుల మిశ్రమంలో 10వ శతాబ్దంలో రాజు చాళుక్య భీముడు ఈ ఆల‌యాన్ని నిర్మించారు. ఈ ఆలయ గోపురం అందాలు, ఆలయం పక్కనే ఉన్న చెరువు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి.

ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆహ్ల‌ద‌ప‌రుస్తుంది. ఈ ఆలయ సముదాయంలో భీమేశ్వరుడు (శివుడు భీమేశ్వర స్వామి, 14 అడుగుల ఎత్తైన స్పటిక లింగం), మాణిక్యాంబ, విరూపాక్ష, నటరాజ, ఆంజనేయ, గణేశుడివ విగ్ర‌హాలు ఉంటాయి. ప్రతిరోజూ అనేక మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ద్రాక్షారామ దేవాలయం పంచారామ క్షేత్రం, శక్తి పీఠం రెండూ అయినందున యానాం సమీపంలోని ఒక ప్ర‌సిద్ధ ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా ఈ ప్రాంతం విరాజిల్లుతుంది.

sriveereswaraswamytemple

శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం

యానాం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినప్పుడు తప్పనిసరిగా సందర్శించే దేవాలయాలు ఇది ఒక‌టి. శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, యానాంలోని కొండపై ఉంది. ఇది అత్యంత గౌరవనీయమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. అవివాహితులు కానీ వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు కానీ ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారైనా సంద‌ర్శస్తే వారి స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ని ఇక్క‌డివారి న‌మ్మ‌కం. అందుకే చాలామంది భ‌క్తులు ఈ ఆలయాన్ని సంద‌ర్శిస్తుంటారు.

కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం

ఈ అభ‌యార‌ణ్యం భారతదేశంలోని మడ అడవులలో మూడవ అతిపెద్ద విస్తీర్ణంలో ఉంది. కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం 24 రకాల మడ చెట్లను కలిగి ఉండ‌ట‌మే కాకుండా, 120కి పైగా వివిధ పక్షి జాతులను కలిగి ఉంది. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం యానాం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మడ అడవుల అందాలను చూసేందుకు ఏరియల్ వ్యూపాయింట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యంలో పక్షులు, జంతువులను చూడటానికి బోటింగ్ ఎంతో ఉత్తమమైన‌ మార్గం. ఇది గోదావరి నుండి కోరింగ బ్యాక్ వాటర్‌లో ఉంటుంది.

ఈ అభ‌యార‌ణ్యంలో బంగారు నక్క, సముద్రపు తాబేలు, చేపలు పట్టే పిల్లి వంటివి ఉన్నాయి. ప్రతి రోజు, ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 వరకు ఈ అభ‌యార‌ణ్యం తెరిచి ఉంటుంది. మంగళవారాలలో మాత్ర‌మే ఇది మూసివేయ‌బ‌డుతుంది. యానాం నుండి కాకినాడకు వెళ్లే ప్రతి బస్సు కోరింగ వన్యప్రాణి అభయారణ్యం రహదారి గుండా బ‌య‌లుదేరుతుంది. ఇది NH 216 హైవేపై ఉంది. అక్క‌డి నుండి రెండు కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సి ఉంటుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+